VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
జయలలిత మరణంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తో పాటు వీకే శశికళ, ఇద్దరు అధికారులపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తప్పు తప్పకుండా వారిదే అని కమిషన్ పేర్కొంది. అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత పరువు తీసేందుకే డీఎంకే ఇలా చేస్తోందని విమర్శించారు. నన్ను ఇందులో ఇరికించడంపై అభ్యంతరం లేదని.. అయితే తన సోదరి జయలలిత పరువు తీసేలా డీఎంకే వ్యూహం పన్నిందని అన్నారు. నన్ను రాజకీయాల నుంచి బహిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అమ్మ మరణాన్ని దీని కోసం వాడటం దారుణమని అన్నారు. గతంలో జయలలిత మరణాన్ని రాజకీయం చేశారు. ప్రస్తుతం అరుముగస్వామి కమిషన్ నివేదికను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్దారు.
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తనకు జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. నేను కోరుకున్నదల్లా ఆమెకు మంచి చికిత్స అందించాలని.. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్లడాన్ని నేను ఎప్పుడు ఆపలేదని ఆమె అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా యాంజియో అవసరం లేదని నిర్ణయించారని.. ఊహల ఆధారంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని ప్రజలు నమ్మరని శశికళ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!