VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
జయలలిత మరణంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తో పాటు వీకే శశికళ, ఇద్దరు అధికారులపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తప్పు తప్పకుండా వారిదే అని కమిషన్ పేర్కొంది. అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత పరువు తీసేందుకే డీఎంకే ఇలా చేస్తోందని విమర్శించారు. నన్ను ఇందులో ఇరికించడంపై అభ్యంతరం లేదని.. అయితే తన సోదరి జయలలిత పరువు తీసేలా డీఎంకే వ్యూహం పన్నిందని అన్నారు. నన్ను రాజకీయాల నుంచి బహిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అమ్మ మరణాన్ని దీని కోసం వాడటం దారుణమని అన్నారు. గతంలో జయలలిత మరణాన్ని రాజకీయం చేశారు. ప్రస్తుతం అరుముగస్వామి కమిషన్ నివేదికను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్దారు.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తనకు జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. నేను కోరుకున్నదల్లా ఆమెకు మంచి చికిత్స అందించాలని.. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్లడాన్ని నేను ఎప్పుడు ఆపలేదని ఆమె అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా యాంజియో అవసరం లేదని నిర్ణయించారని.. ఊహల ఆధారంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని ప్రజలు నమ్మరని శశికళ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!