VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
జయలలిత మరణంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తో పాటు వీకే శశికళ, ఇద్దరు అధికారులపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తప్పు తప్పకుండా వారిదే అని కమిషన్ పేర్కొంది. అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత పరువు తీసేందుకే డీఎంకే ఇలా చేస్తోందని విమర్శించారు. నన్ను ఇందులో ఇరికించడంపై అభ్యంతరం లేదని.. అయితే తన సోదరి జయలలిత పరువు తీసేలా డీఎంకే వ్యూహం పన్నిందని అన్నారు. నన్ను రాజకీయాల నుంచి బహిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అమ్మ మరణాన్ని దీని కోసం వాడటం దారుణమని అన్నారు. గతంలో జయలలిత మరణాన్ని రాజకీయం చేశారు. ప్రస్తుతం అరుముగస్వామి కమిషన్ నివేదికను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్దారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తనకు జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. నేను కోరుకున్నదల్లా ఆమెకు మంచి చికిత్స అందించాలని.. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్లడాన్ని నేను ఎప్పుడు ఆపలేదని ఆమె అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా యాంజియో అవసరం లేదని నిర్ణయించారని.. ఊహల ఆధారంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని ప్రజలు నమ్మరని శశికళ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!