VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
జయలలిత మరణంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తో పాటు వీకే శశికళ, ఇద్దరు అధికారులపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తప్పు తప్పకుండా వారిదే అని కమిషన్ పేర్కొంది. అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత పరువు తీసేందుకే డీఎంకే ఇలా చేస్తోందని విమర్శించారు. నన్ను ఇందులో ఇరికించడంపై అభ్యంతరం లేదని.. అయితే తన సోదరి జయలలిత పరువు తీసేలా డీఎంకే వ్యూహం పన్నిందని అన్నారు. నన్ను రాజకీయాల నుంచి బహిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అమ్మ మరణాన్ని దీని కోసం వాడటం దారుణమని అన్నారు. గతంలో జయలలిత మరణాన్ని రాజకీయం చేశారు. ప్రస్తుతం అరుముగస్వామి కమిషన్ నివేదికను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్దారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తనకు జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. నేను కోరుకున్నదల్లా ఆమెకు మంచి చికిత్స అందించాలని.. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్లడాన్ని నేను ఎప్పుడు ఆపలేదని ఆమె అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా యాంజియో అవసరం లేదని నిర్ణయించారని.. ఊహల ఆధారంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని ప్రజలు నమ్మరని శశికళ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!