West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఝర్గ్రామ్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరిగింది. ఆరో దశ పోలింగ్లో భాగంగా మిడ్నాపూర్ జిల్లాలోని గర్బెటాలోని మంగళపోత ప్రాంతాన్ని సందర్శిస్తున్న సమయంలో బీజేపీ నేత ప్రనత్ తుడుపై దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లదాడి జరగడంతో భద్రతా సిబ్బంది అతనికి రక్షణ కల్పించింది. ఈ దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రనత్ తుడతో పాటు అతని భద్రతా సిబ్బంది, మీడియా పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు వ్యక్తులు బీజేపీ అభ్యర్థిని వెంబడించడం విజువల్స్లో చూడొచ్చు.
Read Also: MS Dhoni: ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గుండాలు కారణమని తుడు ఆరోపించారు. ఇద్దరు భద్రతా సిబ్బంది తలకు గాయమై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి భద్రతా సిబ్బంది ఓటేసేందుకు క్యూలో నిలబడిన మహిళపై దాడి చేయడంతోనే నిరసనకు దారి తీసిందని అధికార టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనపై బీజేపీ బెంగాల్ కో ఇంచార్జ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా టీఎంసీని నిందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు ఓటు వేస్తు్న్నారని ట్వీట్ చేశారు. పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదన్న రిపోర్టులు రావడంతో గార్పేటలోని కొన్ని పోలింగ్ బూతులకు వెళ్లినట్లు ప్రనత్ తుడు చెప్పారు. అకాస్మాత్తుగా టీఎంగీ గుండాలు నా కారుపై ఇటుకలతో దాడి చేశారని, నా భద్రతా సిబ్బంది గాయపడ్డారని, ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల తలకు గాయాలు అయ్యాయని చెప్పారు.
Mamata Banerjee is murdering democracy in Bengal. Now, TMC goons attack BJP’s Jhargram (a Tribal seat) candidate and ABP Ananda’s crew. Despite attempts to preclude people from casting vote, West Bengal has one of the highest voter turnout across the country. People are voting to… pic.twitter.com/ZMdTPhxiYw
— Amit Malviya (@amitmalviya) May 25, 2024
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!