Ebrahim Raisi: భారత్ తరుపున ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతి..
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ , విదేశాంగ మంత్రి హెస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ల మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ తరుపున బుధవారం ఇరాన్లో జరిగిన రైసీ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఇరువురు నేతల మరణం పట్ల ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ మోఖ్బర్ని కలుసుకుని ధన్కర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అధికారిక అంత్యక్రియల్లో భారత ప్రతినిధి బృందానికి ఉపరాష్ట్రపతి నాయకత్వం వహించారు.
Read Also: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
రైసీ మరణానికి గౌరవ సూచకంగా మంగళవారం భారత్ అంతటా ఒక రోజు సంతాపాన్ని పటాటించారు. వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఇతర అధికారులకు నివాళులు అర్పిస్తున్న ఫోటోను ఆయన కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. అధికారిక అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతికి అక్కడి అధికారులు టెహ్రాన్లో స్వాగతం పలికారు. అంతకుముందు రైసీ మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. మంగళవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాపాన్ని తెలియజేశారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లోని ఒక ఉమ్మడి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి, తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆదివారం ఈ ఘటన సంభవించింది. విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో బుధవారం వీరిద్దరి అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Hon'ble Vice-President, Shri Jagdeep Dhankhar paid tributes to Late President Dr. Seyyed Ebrahim Raisi, Late Foreign Minister Dr. Hossein Amir-Abdollahian and other Iranian Officials in Tehran today.
VP Dhankhar also met Dr. Mohammad Mokhber, Acting President of Iran and… pic.twitter.com/Rbkd9yltWT
— Vice-President of India (@VPIndia) May 22, 2024
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!