Mumbai: సావర్కర్ సేతుగా వెర్సోవా-బాంద్రా వంతెన .. పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai:|మహారాష్ట్రలోని వివిధ పట్టణాలు, నగరాల పేర్లను మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఉత్తర్ప్రదేశ్లో కూడా కొన్ని పట్టణాలను ఇప్పటి వరకు ఉన్న పేర్లతో కాకుండా ఆయా పట్టణాలకు పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు సీ లింక్ పేరును మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మరో హార్బర్ లింక్ పేరును సైతం మార్చుతూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also: Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
వెర్సోవా-బాంద్రా సీ లింక్ను వీర్ సావర్కర్ సేతుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను సైతం అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి న్హవా శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది. వంతెనకు సావర్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్ల మీద మార్చడం జరిగిందని పేరుపై గొడవలు ఉండవని అన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్, లేదా వీర్ సావర్కర్, హిందూ జాతీయవాద నాయకుడు మరియు ఫైర్బ్రాండ్ విప్లవకారుడు, అటల్ బీహార్ వాజ్పేయి మాజీ ప్రధాని అని గుర్తు చేశారు.
Read also: Honour Killing: మరో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. మనస్తాపంతో ప్రేమికుడు సూసైడ్
1910లో సావర్కర్ను అరెస్టు చేసి.. జైలు శిక్ష విధించారని తెలిపారు. అతను 13 సంవత్సరాల పాటు అండమాన్, నికోబార్ దీవుల సెల్యులార్ జైల్లో (కాలా పానీలో) మగ్గిపోయాడని తెలిపారు. 1921 లో ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని రాశారు గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు భారత ప్రధాని అయ్యారని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996 మరియు 2004 మధ్య మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?