Vegetarian Crocodile: భక్తులను ఆశీర్వదించే శాఖాహార మొసలి కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొసలి అనగానే అది మాంసాహారాన్నే తీసుకుంటుందని అనుకుంటాం.. సముద్రంలో, చెరువుల్లో, నదుల్లో ఇలా ఎక్కడున్నా కూడా మనుషులపై ముసుళ్లు దాటిచేసిన ఘటనలు అనేకం.. ఇక, ఒడ్డుకు వచ్చిన జంతువులపై కూడా అదునుచూసి.. లాగేయడంలో వాటికి అవేసాటి.. బలవంతమైన ఏనుగు కూడా నీటిలో ఉన్నప్పుడు.. ముసలికి చిక్కిందంటే.. ఇక అంతే సంగతులు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. కేరళ కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో ఉండే మొసలి మాత్రం మాంసం జోలికి వెళ్లదు.. అది పూర్తిగా శాఖాహారి.. ఆ సరస్సులో ఉండే అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పెట్టే బెల్లం, బియ్యం లాంటి ప్రసాదాలు మాత్రమే తినే 77 ఏళ్ల వయస్సున్న మొసలి ఇప్పుడు కన్నుమూసింది.. బబియా అనే పిలవగానే వచ్చి.. ప్రసాదం తీసుకుని.. భక్తులను ఆశీర్వదించే.. ఆ అరుదైన మొసలి.. కన్నుమూయడంతో.. భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు..
Read Also: Munugode Bypoll: ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. మంత్రి జగదీష్రెడ్డి సంచలన ప్రకటన
Also Read
అయితే, దాదాపు 77 ఏండ్ల కిందట కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో కనిపించింది ఆ మొసలి..1945లో ఆ సరస్సులో ఉన్న ఓ మొసలిని బ్రిటిష్ సైనికుడు కాల్చిచంపగా.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ మొసలి ప్రత్యక్షమైందని భక్తులు నమ్ముతారు.. అప్పటి నుంచి 70 ఏళ్లను కూడా సరస్సులోనే ఉంటూ.. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి ప్రసాదాలు స్వీకరించే ఆ మొసలి.. ఇప్పటి వరకు ఎవరికీ కీడు చేసింది లేదు.. ఇక, ఆలయ నిర్వాహకులు దానికి బబియా అని నామకరణం చేసి.. దాని బాగోగులు చూసుకుంటూ వచ్చారు.. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే ప్రసాదం స్వీకరించి.. వారిని ఆశీర్వదించి.. ఆ సరస్సులో ఆలయం చుట్టూ తిరగడమే బబియా పని.. కొన్నిసార్లు మెట్లపైకి వచ్చి సేదతీరుతూ ఉండేది.. ఇది పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.. కానీ, 70 ఏళ్లకు పైగా భక్తులను కనువిందు చేసిన బబియా ఇప్పుడు ప్రాణాలు విడిచింది.. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న బబియాకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది.. చివరకు ఆదివారం రాత్రి శాశ్వతంగా కన్నుమూసింది..
అయితే, బాబియా ఎప్పుడూ భక్తులను బెదిరించలేదు మరియు విధేయతతో చెరువు నుండి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఇతర జీవులకు మరియు చేపలకు కూడా హాని కలిగించదు.. ప్రజలు మరియు దేవాలయం పూజారులు సమర్పించే నైవేద్యాలతో మాత్రమే మనుగడ సాగిస్తుందని నమ్మకం.. అందుకే దీనికి శాఖాహార మొసలి అని పేరు వచ్చింది. మొసలి అప్పుడప్పుడు సరస్సులోని బొరియ నుండి ఒడ్డుకు వచ్చి పూజా మందిరానికి చేరుకునేది.. బబియా గుడి ముందు ‘దర్శనం’ చేస్తున్నప్పుడు.. ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారం పొందింది.. మరియు భక్తులు కూడా బబియాను ఫొటోలు తీశారు.. సెల్ఫీలు కూడా దిగిన సందర్భాలు ఉన్నాయి.. ఇక, కన్నుమూయడం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.. బబియాకు ఆలయానికి సంబంధించిన మైదానంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి.. బబియాకు కన్నీటివీడ్కోలు పలికారు..
తాజావార్తలు
-
Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్కు వ్యాక్సిన్!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
-
Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
-
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!