Vande Bharat Trains: ఇకపై 14 నిమిషాల్లోనే వందేభారత్ రైళ్లు శుభ్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Trains: ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. దేశం మొత్తం ఇప్పుడు 68 వందేభారత్ రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం చేయాలనే కొత్త విధానాన్ని రైల్వేశాఖ తీసుకురాబోతోంది. ‘ 14 మినిట్స్ ఆఫ్ మిరాకిల్’ కాన్సెప్టును అక్టోబర్ 1 నుంచి ప్రవేశపెడుతోంది. రైళ్లు ప్రారంభయమ్యే వాటి గమ్యస్థానాల్లో ఈ విధానం ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ లో దీన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు.
వందేభారత్ రైళ్ల సమయపాలన కోసం కేవలం 14 నిమిషాల్లోనే వాటిని శుభ్రం చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది ప్రత్యేకమైన కాన్సెప్ట్ అని భారతదేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. జపాన్ లోని ఒసాకా, టోక్యో వంటి స్టేషన్లలో ‘7 మినిట్స్ ఆఫ్ మిరాకిల్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా భారత రైల్వేలు దీన్ని తీసుకురాబోతున్నాయి. జపాన్ లోని బుల్లెట్ రైళ్లను 7 నిమిషాల్లో శుభ్రం చేసి ప్రయాణానికి సిద్ధం చేస్తారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Read Also: Communal Tension: జైపూర్లో మత ఉద్రిక్తత.. అపార్ధం చేసుకుని ఒక వ్యక్తి హత్య..
రైలు క్లీనింగ్ లో నిమగ్నమై ఉన్న వర్కర్ల సంఖ్యను పెంచకుండా వారి యొక్క శుభ్రపరిచే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఈ 14 నిమిషాల కాన్సెప్ట్ సాధ్యమైందని రైల్వే మంత్రి చెప్పారు. ఢిల్లీ స్టేషన్ లోనే కాకుండా వందేభారత్ రైళ్ల రాకపోకలను బట్టి వారణాసి, గాంధీనగర్, మైసూర్, నాగ్పూర్ స్టేషన్లలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఈ కాన్సెప్ట్ ప్రారంభించే ముందు రైల్వేలు రెండు డ్రై రన్లను నిర్వహించాయి. మొదటిసారిగా అటెండెంట్లు 28 నిమిషాల్లో రైలును శుభ్రం చేస్తే, రెండోసారి 18 నిమిషాల్లోనే సాధ్యమైంది, అయితే ఇప్పుడు ఎలాంటి కొత్త టెక్నాలజీ లేకుండా కేవలం 14 నిమిషాల్లోనే ఇది సాధ్యపడుతోందని మంత్రి చెప్పారు. వందేభారత్ లో ప్రారంభమైన ఈ ప్రక్రియను క్రమంగా ఇతర రైళ్లకు కూడా వర్తింప చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!