Postponed: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ లాంచ్ వాయిదా..
- రైలును పరిక్షించే సమయంలో చిన్న చిన్న సమస్యలు
- రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో వందే భారత్ స్లీపర్ కు టెస్ట్ డ్రైవ్
- డిసెంబర్ లోపు పట్టాలెక్కిస్తామన్న రైల్వే మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేస్ న్యూస్ ప్రయాణీకులకు షాకిచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సిన.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ క్లాస్ లాంచ్ ను వాయిదా వేసినట్లు తెలిపింది రైల్వే శాఖ. అయితే ప్రస్తుతం దీన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని.. వచ్చే డిసెంబర్ లో తిరిగి ప్రారంభిస్తామని రైల్లే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
పూర్తి వివరాల్లోకి నవంబర్ లో ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ లాంచ్ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే.. బోగీలు, సీట్లు, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉందని.. రైలును పరిక్షించే సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వేగంగా పనులు పూర్తవుతున్నాయని.. డిసెంబర్ లోగా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కుతాయని రైల్వే మంత్రి తెలిపారు.
చిన్న చిన్న మార్పులే అయినప్పటికి .. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసే BEML, ప్రోటోటైప్ రేక్ను రెట్రోఫిట్టింగ్ కోసం తమకు తిరిగి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో వందే భారత్ స్లీపర్ కు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. రైళ్లలో కొత్త AC డక్ట్ లొకేషన్లు, అగ్ని భద్రత కోసం ఆర్క్-ఫాల్ట్ డిటెక్షన్ పరికరాలు, CCTV కోసం ఫైర్-సర్వైవల్ కేబుల్స్, యూరోపియన్ ఫైర్, క్రాష్ ప్రమాణాలకు వ్యతిరేకంగా థర్డ్-పార్టీ ఆడిట్లు, అత్యవసర అలారం బటన్ల కోసం కొత్త స్థానాలు వంటి అనేక ముఖ్యమైన మార్పులు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో మొట్టమొదటి వందే భారత్ రైలు స్లీపర్ కోచ్ నిర్వహణ సౌకర్యం 2026 మధ్య నాటికి రాజస్థాన్లోని జోధ్పూర్లో సిద్ధంగా ఉంటుందని.. నార్త్ వెస్ట్రన్ రైల్వే సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ అమిత్ స్వామి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!