Vande Bharat Express: వేగాన్ని అందుకోలేకపోతున్న వందేభారత్.. సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. అయితే వందే భారత్ రైలు ప్రారంభం అయిన రెండేళ్లలో రైలు గరిష్ట సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. కేవలం ఒకే రూట్లో మాత్రమే 95 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లు తెలిపింది.
Read Also: Atiq Ahmed: అతిక్ అహ్మద్ హత్య ఎవరికి లాభం.. ఐఎస్ఐ కుట్ర దాగుందా..?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో, ఇది వెలుగులోకి వచ్చింది. 2021-22లో వందేభారత్ రైల్ సగటు వేగం 84.48గా ఉండగా, 2022-23లో 81.38 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. రైలుకు వేగంగా వెళ్లే సామర్థ్యం ఉన్న ప్పటికీ ట్రాక్స్ కు దాన్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటిలో ఢిల్లీ-వారణాసి రైల మాత్రమే సగటున 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ముంబాయి సీఎస్టీ-సాయినగర్ షిర్డీల మధ్య నడుస్తున్న వందే భారత్ రైల్ సగటు వేగం గంటలకు 64 కిలోమీటర్లుగా ఉంది. రాణి కమలాపతి భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ రైలు గంటకు 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని, శతాబ్ధి రైళ్ల సగటు వేగం కన్నా ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!