Vande Bharat Express: వేగాన్ని అందుకోలేకపోతున్న వందేభారత్.. సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. అయితే వందే భారత్ రైలు ప్రారంభం అయిన రెండేళ్లలో రైలు గరిష్ట సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. కేవలం ఒకే రూట్లో మాత్రమే 95 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లు తెలిపింది.
Read Also: Atiq Ahmed: అతిక్ అహ్మద్ హత్య ఎవరికి లాభం.. ఐఎస్ఐ కుట్ర దాగుందా..?
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో, ఇది వెలుగులోకి వచ్చింది. 2021-22లో వందేభారత్ రైల్ సగటు వేగం 84.48గా ఉండగా, 2022-23లో 81.38 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. రైలుకు వేగంగా వెళ్లే సామర్థ్యం ఉన్న ప్పటికీ ట్రాక్స్ కు దాన్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటిలో ఢిల్లీ-వారణాసి రైల మాత్రమే సగటున 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ముంబాయి సీఎస్టీ-సాయినగర్ షిర్డీల మధ్య నడుస్తున్న వందే భారత్ రైల్ సగటు వేగం గంటలకు 64 కిలోమీటర్లుగా ఉంది. రాణి కమలాపతి భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ రైలు గంటకు 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని, శతాబ్ధి రైళ్ల సగటు వేగం కన్నా ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!