Uttarakhand: కూలిన నిర్మాణంలో ఉన్న సిగ్నేచర్ బ్రిడ్జ్
- కూలిన నిర్మాణంలో ఉన్న సిగ్నేచర్ బ్రిడ్జ్
- ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రంలో వరుస వంతెనలు కూలడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే అక్కడ డజన్కు బ్రిడ్జ్లు కూలిపోయాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ వంతు వచ్చింది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. రుద్రప్రయాగ్లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం విశేషం. ఈ వంతెనను ఆర్సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు.

Also Read
గురువారం సాయంత్రం 4.15 గంటలకు ఈ సంఘటన జరిగిందని అధికారి తెలిపారు. కానీ పునాది మాత్రం చెక్కుచెదరలేదన్నారు. టవర్ మాత్రమే కూలిపోయిందని చెప్పారు. సాంకేతిక కమిటీ సంఘటనను పరిశీలించి.. ఏమి తప్పు జరిగిందో చూస్తుందని అధికారి తెలిపారు.
పనులు నాసిరకంగా, నిర్లక్ష్యంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే అథారిటీ మరియు ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదని స్థానిక నివాసి ఆరోపించారు. సాధారణంగా ప్రతిరోజూ 40 మంది కార్మికులు ఈ సమయంలో పని చేస్తారని మరో అధికారి తెలిపారు. ఈ రోజు వంతెనపై ఎవరూ పని చేయడం లేదని అధికారి తెలిపారు.
Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE
— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!