Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand avalanche-Death toll climbs to 26: పర్వతారోహణ విషాదంగా మారింది. ఉత్తరాఖండ్ హిమపాతం సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 26 మంది మరణించారు. మరో ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా శనివారం మరో ఏడు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్టోబర్ 4న భారీ హిమపాతం సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.
Read Also: Pakistan: పాక్ ప్రభుత్వానికి షాక్.. స్వాత్ లోయలో ప్రజల నిరసనలు
Also Read
అక్టోబర్ 4న ద్రౌపది కా దండ-2 శిఖారాన్ని అధిరోహిస్తున్న క్రమంలో పర్వతారోహకులు బృందంపై మంచు విరుచుకుపడింది. ఈ బృందం కిందికి తిరిగి వస్తుండగా 17,000 అడుగుల ఎత్తులో ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్కు చెందిన పర్వతారోహకుల బృందం ఈ ప్రమాదం బారిన పడింది. మంచులో కూరుకుపోవడం, అత్యంత శీతల పరిస్థితుల్లో చిక్కుకోవడంతో చాలా మంది మరణించారు. శిక్షకులతో పాటు పర్వతారోహణలో శిక్షణ తీసుకుంటున్నవారు మరణించారు.
వాతావరణ పరిస్థితులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా తప్పిపోయిన మరో ముగ్గురికోసం అన్వేషణ కొనసాగుతోంది. చలికాలం దగ్గరికి రావడంతో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మంచుతీవ్రత పెరుగుతోంది. మంచు, వర్షం పరిస్థితుల మధ్య పర్వతారోహణ, టెక్కింగ్ కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
#WATCH | Uttarkashi Avalanche: Seven bodies of mountaineers who were trapped in the avalanche, brought to Matli in Uttarkashi.#Uttarakhand pic.twitter.com/d8tqZ7W4nu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2022
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?