Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..
Uttarakhand avalanche-Death toll climbs to 26: పర్వతారోహణ విషాదంగా మారింది. ఉత్తరాఖండ్ హిమపాతం సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 26 మంది మరణించారు. మరో ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా శనివారం మరో ఏడు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్టోబర్ 4న భారీ హిమపాతం సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.
Read Also: Pakistan: పాక్ ప్రభుత్వానికి షాక్.. స్వాత్ లోయలో ప్రజల నిరసనలు
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
అక్టోబర్ 4న ద్రౌపది కా దండ-2 శిఖారాన్ని అధిరోహిస్తున్న క్రమంలో పర్వతారోహకులు బృందంపై మంచు విరుచుకుపడింది. ఈ బృందం కిందికి తిరిగి వస్తుండగా 17,000 అడుగుల ఎత్తులో ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్కు చెందిన పర్వతారోహకుల బృందం ఈ ప్రమాదం బారిన పడింది. మంచులో కూరుకుపోవడం, అత్యంత శీతల పరిస్థితుల్లో చిక్కుకోవడంతో చాలా మంది మరణించారు. శిక్షకులతో పాటు పర్వతారోహణలో శిక్షణ తీసుకుంటున్నవారు మరణించారు.
వాతావరణ పరిస్థితులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా తప్పిపోయిన మరో ముగ్గురికోసం అన్వేషణ కొనసాగుతోంది. చలికాలం దగ్గరికి రావడంతో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మంచుతీవ్రత పెరుగుతోంది. మంచు, వర్షం పరిస్థితుల మధ్య పర్వతారోహణ, టెక్కింగ్ కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
#WATCH | Uttarkashi Avalanche: Seven bodies of mountaineers who were trapped in the avalanche, brought to Matli in Uttarkashi.#Uttarakhand pic.twitter.com/d8tqZ7W4nu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2022
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!