Pakistan: పాక్ ప్రభుత్వానికి షాక్.. స్వాత్ లోయలో ప్రజల నిరసనలు
Public protests against the government in Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు అక్కడి ప్రజలు. అమెరికా రాయబారి డోనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పర్యటన ద్వారా మైలేజ్ పొందాలని భావిస్తున్న పాకిస్తాన్ కు షాక్ ఇస్తున్నారు ప్రజలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని స్వాత్ లోయలో ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. షెహజాబ్ షరీఫ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం విఫలం అయితే ఆయుధాలు చేతపట్టాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
స్వాత్ లోయలోని ఖ్వాజఖేలా మట్టా చౌక్ లో స్వాత్ ఒలాసి ససూన్, స్వాత్ ఖ్వామీ బిర్గా భారీ సమావేశానికి పిలుపునిచ్చింది. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పాకిస్తాన్ లో అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ ఇటీవల పీఓకేను సందర్శించి.. దాన్ని ఆజాద్ కాశ్మీర్ గా పేర్కొన్నారు. మళ్లీ పాకిస్తాన్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని దాయాది దేశం భావిస్తోంది. ఇలాంటి సమయంలోనే తాజా నిరసనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి ఇబ్బందికరంగా మారాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Son Attacked Parents: స్టాక్ మార్కెట్ లో లక్షల్లో లాస్.. డబ్బుకోసం తల్లిదండ్రులను దారుణ హత్య
స్వాత్ లోయలో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వాత్ లోయలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ తీసేసి విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సెప్టెంబర్ లో పాకిస్తాన్ లో మొత్తం 42 తీవ్రవాద దాడులు జరిగాయి. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులకు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ప్రభుత్వంతో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థకు చర్చలు నిలిచిపోవడంతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. 2022 మొదటి ఆరు నెలల్లో భద్రతా దళాలపై మొత్తం 434 ఉగ్రవాద దాడులు జరిగాయి. 323 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!