Lakhimpur Kheri Incident: దళిత బాలికల అత్యాచారం, హత్య కేసులో దోషులను యోగి ప్రభుత్వం వదిలిపెట్టదు: డిప్యూటీ సీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
uttar pradesh-Lakhimpur Kheri minor girls Incident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ దళిత బాలికల హత్యా, అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై యోగీ ప్రభుత్వంపై బీఎస్పీ, ఎస్పీ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో.. నిందితులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. యోగీ ప్రభుత్వం తప్పకుండా శిక్షించి తీరుతుందని.. హామీ ఇచ్చారు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంలు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.
లఖీంపూర్ ఘటన విచారకరమని.. నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం హామీ ఇచ్చారు. దళిత బాలికలకు న్యాయం చేస్తామని.. నేరస్తుల్లో వణుకుపుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని .. మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ అన్నారు. అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, మాయావతి రాజకీయాలు చేయకుండా కుటుంబాన్ని ఓదార్చాలని హితవు పలికారు కేశవ్ ప్రసాద్ మౌర్య.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
Read Also: Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత బాలికను అత్యాచారం, హత్య చేసి దారుణం చంపారు. చెట్టుకు ఉరేసి వీరిద్దరిని చంపారు. ఈ కేసులో చోటు, జునైడ్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరీఫ్ అనే మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా చనిపోయిన అమ్మాయిలతో స్నేహం నటిస్తూ.. బుధవారం వారిని పొలానికి రప్పించారని.. సోహైల్, జునైద్ అమ్మాయిలపై అత్యాచారం చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులను, బాలికలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతు కోసి చంపారని.. కరీముద్దీన్, ఆరీఫ్ ఇద్దరు బాలికను ఉరితీశారిన ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం లఖీంపూర్ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ పూర్ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
తాజావార్తలు
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..