Lakhimpur Kheri Incident: దళిత బాలికల అత్యాచారం, హత్య కేసులో దోషులను యోగి ప్రభుత్వం వదిలిపెట్టదు: డిప్యూటీ సీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
uttar pradesh-Lakhimpur Kheri minor girls Incident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ దళిత బాలికల హత్యా, అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై యోగీ ప్రభుత్వంపై బీఎస్పీ, ఎస్పీ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో.. నిందితులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. యోగీ ప్రభుత్వం తప్పకుండా శిక్షించి తీరుతుందని.. హామీ ఇచ్చారు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంలు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.
లఖీంపూర్ ఘటన విచారకరమని.. నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం హామీ ఇచ్చారు. దళిత బాలికలకు న్యాయం చేస్తామని.. నేరస్తుల్లో వణుకుపుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని .. మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ అన్నారు. అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, మాయావతి రాజకీయాలు చేయకుండా కుటుంబాన్ని ఓదార్చాలని హితవు పలికారు కేశవ్ ప్రసాద్ మౌర్య.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత బాలికను అత్యాచారం, హత్య చేసి దారుణం చంపారు. చెట్టుకు ఉరేసి వీరిద్దరిని చంపారు. ఈ కేసులో చోటు, జునైడ్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరీఫ్ అనే మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా చనిపోయిన అమ్మాయిలతో స్నేహం నటిస్తూ.. బుధవారం వారిని పొలానికి రప్పించారని.. సోహైల్, జునైద్ అమ్మాయిలపై అత్యాచారం చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులను, బాలికలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతు కోసి చంపారని.. కరీముద్దీన్, ఆరీఫ్ ఇద్దరు బాలికను ఉరితీశారిన ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం లఖీంపూర్ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ పూర్ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!