హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'ను నిర్వహించింది. ఇప్పుడు దాదాపు ఏడాదిన్నరలో దీని ప్రభావం రాష్ట్రంలో కనిపించడం మొదలైంది.
Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది.
Atiq Ahmed: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్కు ప్రయాగ్ రాజ్ కోర్టు ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు విధించింది. అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ తో పాటు మరో ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే అన్నదమ్ములకు ప్రస్తుతం ఎన్ కౌంటర్ భయం పట్టుకుంది. యూపీ పోలీసులు తమను ఎన్ కౌంటర్ చేస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. అతీక్ అహ్మద్ జైలు నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
Umesh Pal murder case: యూపీ రాజకీయాలను ఉమేష్ పాల్ హత్య కేసు కుదిపేస్తోంది. ఇటీవల ఈ హత్యపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆ పార్టీ చీఫ్ పై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల కోసం 10 పోలీస్ టీములు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే…
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
Case against MIM party leader for making controversial remarks: ఉత్తర్ ప్రదేశ్ ఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. దీనిపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అక్బర్ జోధా బాయిని పెళ్లి చేసుకున్నాడు మనకన్నా సెక్యులర్ ఎవరు..? ముస్లింలు రెండు వివాహాలు చేసుకుంటారు.. ఇద్దరు భార్యలను గౌరవిస్తారు. అయితే హిందువులు ఒకరిని పెళ్లి చేసుకుని ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు…
Uttar Pradesh Minister Sanjay Nishad Controversial comments: ఉత్తర్ ప్రదేశ్ మినిస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేవ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదును తొలగించాలని పిలుపునిచ్చాడు. భారతదేశంలో మతపరమైన ఉన్మాదం విస్తరిస్తోందని.. దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించానలి బుధవారం బాగ్ పత్ లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మదర్సాల సర్వేపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. మదర్సాలకు ఉగ్రవాదులతో సంబంధాలు…
uttar pradesh-Lakhimpur Kheri minor girls Incident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ దళిత బాలికల హత్యా, అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై యోగీ ప్రభుత్వంపై బీఎస్పీ, ఎస్పీ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో.. నిందితులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. యోగీ ప్రభుత్వం తప్పకుండా శిక్షించి తీరుతుందని.. హామీ ఇచ్చారు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంలు.…