Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదనే నిబంధనలు విధించామని వెల్లడించారు.
ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల లైంగిక నేరాలకు పాల్పడిన వారు సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా.. సాక్ష్యాలను తారుమారు చేయకుండా నివారించవచ్చని ఖన్నా అన్నారు. నిందితులు, బాధితురాలిని, ఇతర సాక్ష్యులను బెదిరించకుండా.. వేధించకుండా ఈ బిల్లు సహాయపడుతుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ(సవరణ) బిల్లును కూడా యూపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దావా వేయడానికి ఇప్పుడున్న మూడు నెలలను మూడేళ్ల వరకు పొడగిస్తుంది.
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
Read Also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్
అల్లర్లలో ఎవరైనా చనిపోతే వారికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేలా క్లెయిమ్ ట్రిబ్యునల్ కు ఈ సవరణ బిల్లు అధికారాన్ని కల్పించనుంది. బాధితుడికి దోషి నుంచి పరిహారం అందేలా.. సొమ్మును రికవరీ చేసేలా ఈ బిల్లు అధికారాన్ని కల్పిస్తోంది. ఆందోళనలు, అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడు వ్యక్తి పరిహారం కోసం అప్పీల్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ట్రిబ్యునల్ అలాంటి కేసులను సుమోటోగా గుర్తించే హక్కు కూడా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల చర్యలకు అయ్యే ఖర్చును కూడా దోషులే భరించాలని బిల్లులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుడి నుంచి వసూలు చేయడానికి 2020లో యూపీ ప్రభుత్వం ‘‘ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్’ను తీసుకువచ్చింది. తాజాగా దీనికి సవరణలు చేశారు. ఈ బిల్లుల సమయంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు గైర్హాజరు అయ్యాయి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..