Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదనే నిబంధనలు విధించామని వెల్లడించారు.
ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల లైంగిక నేరాలకు పాల్పడిన వారు సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా.. సాక్ష్యాలను తారుమారు చేయకుండా నివారించవచ్చని ఖన్నా అన్నారు. నిందితులు, బాధితురాలిని, ఇతర సాక్ష్యులను బెదిరించకుండా.. వేధించకుండా ఈ బిల్లు సహాయపడుతుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ(సవరణ) బిల్లును కూడా యూపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దావా వేయడానికి ఇప్పుడున్న మూడు నెలలను మూడేళ్ల వరకు పొడగిస్తుంది.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Read Also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్
అల్లర్లలో ఎవరైనా చనిపోతే వారికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేలా క్లెయిమ్ ట్రిబ్యునల్ కు ఈ సవరణ బిల్లు అధికారాన్ని కల్పించనుంది. బాధితుడికి దోషి నుంచి పరిహారం అందేలా.. సొమ్మును రికవరీ చేసేలా ఈ బిల్లు అధికారాన్ని కల్పిస్తోంది. ఆందోళనలు, అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడు వ్యక్తి పరిహారం కోసం అప్పీల్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ట్రిబ్యునల్ అలాంటి కేసులను సుమోటోగా గుర్తించే హక్కు కూడా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల చర్యలకు అయ్యే ఖర్చును కూడా దోషులే భరించాలని బిల్లులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుడి నుంచి వసూలు చేయడానికి 2020లో యూపీ ప్రభుత్వం ‘‘ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్’ను తీసుకువచ్చింది. తాజాగా దీనికి సవరణలు చేశారు. ఈ బిల్లుల సమయంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు గైర్హాజరు అయ్యాయి.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!