USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది. అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల ఏప్రిల్ 5న బ్రిటిష్ వార్త పత్రిక ది గార్డియన్ ఒక కథనంలో.. పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగున్న టార్గెటెడ్ హత్యల్లో్ భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, గార్డియన్ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Read Also: Viral Video : హోటల్లలో మీరు తినే చట్నీ ఫ్రెషేనా.. ఈ వీడియో చూస్తే డౌట్ రావడం ఖాయం
Also Read
- NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు సరిహద్దులను కూడా దాటేందుకు భారత్ వెనకడాడని వ్యాఖ్యానించారు. ‘‘ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అమెరికా ఈ సమస్య మధ్యకు రావాలనుకోవడం లేదు. అయతే, భారత్- పాకిస్తాన్ పరిస్థితి తీవ్రత పెంచకుండా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని ప్రోత్సహిస్తాం’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిథి మాథ్యూ మిల్లర్ చెప్పారు.
ఇటీవల గార్డియన్ కథనం వెలువడిన తర్వాత రిషికేష్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, దేశంతలో బలమైన ప్రభుత్వం ఉంది. బలమైన మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి చొరబడి చంపుతాం’’ అని వ్యాఖ్యానించారు. దేశ శాంతికి విఘాగం కలిగించే ఉగ్రవాదుల్ని ప్రభుత్వం విడిచిపెట్టదని, వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లినా వేటాడటం ఖామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందిస్తూ.. భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేస్తుందని ఆరోపించింది. ఇలాంటివి దీర్ఘకాలిక సంబంధాలకు విఘాతమని పేర్కొంది. పాకిస్తాన్ శాంతి కోసం ఎల్లప్పుడూ తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!