USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది. అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల ఏప్రిల్ 5న బ్రిటిష్ వార్త పత్రిక ది గార్డియన్ ఒక కథనంలో.. పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగున్న టార్గెటెడ్ హత్యల్లో్ భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, గార్డియన్ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Read Also: Viral Video : హోటల్లలో మీరు తినే చట్నీ ఫ్రెషేనా.. ఈ వీడియో చూస్తే డౌట్ రావడం ఖాయం
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు సరిహద్దులను కూడా దాటేందుకు భారత్ వెనకడాడని వ్యాఖ్యానించారు. ‘‘ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అమెరికా ఈ సమస్య మధ్యకు రావాలనుకోవడం లేదు. అయతే, భారత్- పాకిస్తాన్ పరిస్థితి తీవ్రత పెంచకుండా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని ప్రోత్సహిస్తాం’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిథి మాథ్యూ మిల్లర్ చెప్పారు.
ఇటీవల గార్డియన్ కథనం వెలువడిన తర్వాత రిషికేష్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, దేశంతలో బలమైన ప్రభుత్వం ఉంది. బలమైన మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి చొరబడి చంపుతాం’’ అని వ్యాఖ్యానించారు. దేశ శాంతికి విఘాగం కలిగించే ఉగ్రవాదుల్ని ప్రభుత్వం విడిచిపెట్టదని, వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లినా వేటాడటం ఖామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందిస్తూ.. భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేస్తుందని ఆరోపించింది. ఇలాంటివి దీర్ఘకాలిక సంబంధాలకు విఘాతమని పేర్కొంది. పాకిస్తాన్ శాంతి కోసం ఎల్లప్పుడూ తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!