USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది. అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల ఏప్రిల్ 5న బ్రిటిష్ వార్త పత్రిక ది గార్డియన్ ఒక కథనంలో.. పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగున్న టార్గెటెడ్ హత్యల్లో్ భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, గార్డియన్ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Read Also: Viral Video : హోటల్లలో మీరు తినే చట్నీ ఫ్రెషేనా.. ఈ వీడియో చూస్తే డౌట్ రావడం ఖాయం
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు సరిహద్దులను కూడా దాటేందుకు భారత్ వెనకడాడని వ్యాఖ్యానించారు. ‘‘ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అమెరికా ఈ సమస్య మధ్యకు రావాలనుకోవడం లేదు. అయతే, భారత్- పాకిస్తాన్ పరిస్థితి తీవ్రత పెంచకుండా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని ప్రోత్సహిస్తాం’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిథి మాథ్యూ మిల్లర్ చెప్పారు.
ఇటీవల గార్డియన్ కథనం వెలువడిన తర్వాత రిషికేష్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, దేశంతలో బలమైన ప్రభుత్వం ఉంది. బలమైన మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి చొరబడి చంపుతాం’’ అని వ్యాఖ్యానించారు. దేశ శాంతికి విఘాగం కలిగించే ఉగ్రవాదుల్ని ప్రభుత్వం విడిచిపెట్టదని, వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లినా వేటాడటం ఖామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందిస్తూ.. భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేస్తుందని ఆరోపించింది. ఇలాంటివి దీర్ఘకాలిక సంబంధాలకు విఘాతమని పేర్కొంది. పాకిస్తాన్ శాంతి కోసం ఎల్లప్పుడూ తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!