Stock market: ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ విలవిల.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి..
- స్టాక్ మార్కెట్లపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..
- 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు కోల్పోయిన భారత ఇన్వెస్టర్లు..
- టాప్-10 కంపెనీల్లో 7 భారీగా నష్టపోయాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధం తగ్గే పరిస్థితులు లేకపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేవలం 4 రోజుల్లోనే పెట్టుబడిదారులు సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత వారం సెన్సెక్స్ 949.74 పాయింట్లు (1.27%) పడిపోయింది, నిఫ్టీ సుమారు 294.9 పాయింట్లు (1.27%) తగ్గింది. బీఎస్ఈలో టాప్-10 కంపెనీలలో 7 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి.
ముఖేస్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 18.25 లక్షల కోట్లకు పడిపోయింది. పెట్టుబడిదారులు రూ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 37,249 కోట్లు తగ్గి రూ. 11.64 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ నష్టాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ఎస్బిఐ మార్కెట్ క్యాప్ రూ. 35,399 కోట్లు తగ్గి రూ. 9.42 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టపోయిన ఇతర కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ ఉన్నాయి.
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
లాభపడిన వాటిలో ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఎల్టి మార్కెట్ క్యాప్ రూ.18,052 కోట్లు పెరిగి రూ.4.90 లక్షల కోట్లకు చేరింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.8,680 కోట్లు పెరిగి రూ.5.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.6,245 కోట్లు పెరిగి రూ.5.15 లక్షల కోట్లకు చేరింది.
అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, విదేశీ పెట్టుబడులు తగ్గే ప్రమాదం, పెట్టుబడిదారుల్లో భయం పెరగడం మార్కెట్ పతనానికి కారణమైంది. నష్టాలు వచ్చినప్పటికీ మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాల్స్, ఇన్ఫోసిస్, ఎల్ అంట టీ ఉన్నాయి.
తాజావార్తలు
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?