Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు భారత్ ప్లాన్.. భగ్నం చేసిన అమెరికా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్లాన్ చేసిందని, భారతదేశం ప్రయేయంపై అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్టు చేస్తున్న పన్నూని భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించింది. యూస్లో ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అతను నిర్వహిస్తున్న ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థను కూడా భారత్ ఉగ్రసంస్థగా ప్రకటించింది. అయితే ఈ కుట్ర గురించి యూఎస్ అధికారులు హెచ్చరించారా..? లేదా..? అనే విషయాన్ని చెప్పడానికి పన్నూ నిరాకరించినట్లు సదరు పత్రిక చెప్పింది. భారత్ నుంచి అమెరికన్ గడ్డపై నా ప్రాణాలకు ముప్పు ఉన్న విషయంపై యూఎస్ ప్రభుత్వం ప్రతిస్పందించనివ్వండి అని పన్నూ చెప్పాడని నివేదించింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
Read Also: GVL Narasimha Rao: కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భారత్ వ్యతిరేకి, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉంటున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను ఆ దేశంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన కొన్ని వారాల తర్వాత, పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే గతంలో ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.
పన్నూ గత కొంత కాలంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వ్యాప్తంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్ వంటి వారికి ప్రాణాపాయ బెదిరింపులు చేశాడు. ఇతనికి, ఇతని సన్నిహితులకు చెందిన ఆస్తుల్ని ఇటీవల ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇటీవల నవంబర్ 19న ఎయిరిండియా విమానాలకు ప్రమాదం ఉందని బెదిరించాడు.
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!