Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు భారత్ ప్లాన్.. భగ్నం చేసిన అమెరికా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్లాన్ చేసిందని, భారతదేశం ప్రయేయంపై అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్టు చేస్తున్న పన్నూని భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించింది. యూస్లో ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అతను నిర్వహిస్తున్న ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థను కూడా భారత్ ఉగ్రసంస్థగా ప్రకటించింది. అయితే ఈ కుట్ర గురించి యూఎస్ అధికారులు హెచ్చరించారా..? లేదా..? అనే విషయాన్ని చెప్పడానికి పన్నూ నిరాకరించినట్లు సదరు పత్రిక చెప్పింది. భారత్ నుంచి అమెరికన్ గడ్డపై నా ప్రాణాలకు ముప్పు ఉన్న విషయంపై యూఎస్ ప్రభుత్వం ప్రతిస్పందించనివ్వండి అని పన్నూ చెప్పాడని నివేదించింది.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: GVL Narasimha Rao: కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భారత్ వ్యతిరేకి, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉంటున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను ఆ దేశంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన కొన్ని వారాల తర్వాత, పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే గతంలో ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.
పన్నూ గత కొంత కాలంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వ్యాప్తంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్ వంటి వారికి ప్రాణాపాయ బెదిరింపులు చేశాడు. ఇతనికి, ఇతని సన్నిహితులకు చెందిన ఆస్తుల్ని ఇటీవల ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇటీవల నవంబర్ 19న ఎయిరిండియా విమానాలకు ప్రమాదం ఉందని బెదిరించాడు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!