UP: దారుణం.. పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం. పెళ్లంతా ఒకెత్తు అయితే.. భోజనాలు మరొకెత్తు. ఇక్కడే చాలా పెళ్లిళ్లలో తేడా కొడతాయి. అడిగింది వేయలేదనో.. పక్కవాడికి వేసి… నాకు వేయలేదనో.. ఇలా ఏదొక విషయంలో గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా జైలుకెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటారా? అయితే ఈ వార్త చవాల్సిందే.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి పెళ్లిలో పనీర్ వడ్డించలేదని ఏకంగా ట్రావెల్ బస్సును విందుశాలపైకి పోనిచ్చాడు. దీంతో అతిథులకు గాయాలు కావడంతో పాటు లక్షల ఖరీదైన వంటకాలన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటన చందౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
ఇది కూడా చదవండి: Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
మొఘల్సరాయ్ కొత్వాలి ప్రాంతంలోని హమీద్పూర్ గ్రామంలో రాజ్నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. శనివారం సాయంత్రం ‘బరాత్’ (వివాహ ఊరేగింపు) ఆలస్యంగా వేదిక దగ్గరకు చేరుకుంది. అంతా బాగానే జరుగుతోంది. ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి.. పెళ్లిలో భోజనం చేస్తున్నాడు. పనీర్ కావాలని అడిగాడు. అది లేదని పెళ్లివారు బదులిచ్చారు. దీంతో అతడు కోపం పట్టలేకపోయాడు. వెంటనే మినీ బస్సుతో ఫుడ్ స్టాల్స్ వైపు దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు అతిథులతో పాటు రూ.3లక్షల ఖరీదైన వంటకాలు నాశనం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో గందరగోళం నెలకొనడంతో అక్కడ నుంచి ధర్మేంద్ర యాదవ్ బయటకు జారుకున్నాడు. ఈ ఘటనలో వరుడి తండ్రి, వధువు మామ సహా అనేక మంది గాయపడ్డారు. వెంటనే వారిని వారణాసిలోని ట్రామా సెంటర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసేంత వరకు పెళ్లి జరగదని వరుడి తరపు వారు పట్టుపట్టారు. దీంతో నిందితుడిపై వధువు తరపు వారు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహం జరగడంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ..
తాజావార్తలు
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!