UP: దారుణం.. పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం. పెళ్లంతా ఒకెత్తు అయితే.. భోజనాలు మరొకెత్తు. ఇక్కడే చాలా పెళ్లిళ్లలో తేడా కొడతాయి. అడిగింది వేయలేదనో.. పక్కవాడికి వేసి… నాకు వేయలేదనో.. ఇలా ఏదొక విషయంలో గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా జైలుకెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటారా? అయితే ఈ వార్త చవాల్సిందే.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి పెళ్లిలో పనీర్ వడ్డించలేదని ఏకంగా ట్రావెల్ బస్సును విందుశాలపైకి పోనిచ్చాడు. దీంతో అతిథులకు గాయాలు కావడంతో పాటు లక్షల ఖరీదైన వంటకాలన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటన చందౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఇది కూడా చదవండి: Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
మొఘల్సరాయ్ కొత్వాలి ప్రాంతంలోని హమీద్పూర్ గ్రామంలో రాజ్నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. శనివారం సాయంత్రం ‘బరాత్’ (వివాహ ఊరేగింపు) ఆలస్యంగా వేదిక దగ్గరకు చేరుకుంది. అంతా బాగానే జరుగుతోంది. ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి.. పెళ్లిలో భోజనం చేస్తున్నాడు. పనీర్ కావాలని అడిగాడు. అది లేదని పెళ్లివారు బదులిచ్చారు. దీంతో అతడు కోపం పట్టలేకపోయాడు. వెంటనే మినీ బస్సుతో ఫుడ్ స్టాల్స్ వైపు దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు అతిథులతో పాటు రూ.3లక్షల ఖరీదైన వంటకాలు నాశనం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో గందరగోళం నెలకొనడంతో అక్కడ నుంచి ధర్మేంద్ర యాదవ్ బయటకు జారుకున్నాడు. ఈ ఘటనలో వరుడి తండ్రి, వధువు మామ సహా అనేక మంది గాయపడ్డారు. వెంటనే వారిని వారణాసిలోని ట్రామా సెంటర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసేంత వరకు పెళ్లి జరగదని వరుడి తరపు వారు పట్టుపట్టారు. దీంతో నిందితుడిపై వధువు తరపు వారు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహం జరగడంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!