UP: దారుణం.. పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం. పెళ్లంతా ఒకెత్తు అయితే.. భోజనాలు మరొకెత్తు. ఇక్కడే చాలా పెళ్లిళ్లలో తేడా కొడతాయి. అడిగింది వేయలేదనో.. పక్కవాడికి వేసి… నాకు వేయలేదనో.. ఇలా ఏదొక విషయంలో గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా జైలుకెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటారా? అయితే ఈ వార్త చవాల్సిందే.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి పెళ్లిలో పనీర్ వడ్డించలేదని ఏకంగా ట్రావెల్ బస్సును విందుశాలపైకి పోనిచ్చాడు. దీంతో అతిథులకు గాయాలు కావడంతో పాటు లక్షల ఖరీదైన వంటకాలన్నీ నేలపాలయ్యాయి. ఈ ఘటన చందౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ఇది కూడా చదవండి: Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్
మొఘల్సరాయ్ కొత్వాలి ప్రాంతంలోని హమీద్పూర్ గ్రామంలో రాజ్నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. శనివారం సాయంత్రం ‘బరాత్’ (వివాహ ఊరేగింపు) ఆలస్యంగా వేదిక దగ్గరకు చేరుకుంది. అంతా బాగానే జరుగుతోంది. ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి.. పెళ్లిలో భోజనం చేస్తున్నాడు. పనీర్ కావాలని అడిగాడు. అది లేదని పెళ్లివారు బదులిచ్చారు. దీంతో అతడు కోపం పట్టలేకపోయాడు. వెంటనే మినీ బస్సుతో ఫుడ్ స్టాల్స్ వైపు దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు అతిథులతో పాటు రూ.3లక్షల ఖరీదైన వంటకాలు నాశనం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో గందరగోళం నెలకొనడంతో అక్కడ నుంచి ధర్మేంద్ర యాదవ్ బయటకు జారుకున్నాడు. ఈ ఘటనలో వరుడి తండ్రి, వధువు మామ సహా అనేక మంది గాయపడ్డారు. వెంటనే వారిని వారణాసిలోని ట్రామా సెంటర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసేంత వరకు పెళ్లి జరగదని వరుడి తరపు వారు పట్టుపట్టారు. దీంతో నిందితుడిపై వధువు తరపు వారు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహం జరగడంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ..
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!