Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ జీవో.. ప్రతిపక్ష కూటమి అభ్యంతరం
- స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ జీవో
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష కూటమి
- ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదిలేదన్న ఉద్ధవ్ థాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Shocking: ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి.. పెళ్లికి 2 రోజుల ముందు కోమాలోకి..
Also Read
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలపై బలవంతంగా హిందీ రుద్దడాన్ని ఏ మాత్రం సహించబోమని ఆయన వ్యా్ఖ్యానించారు. తమ పార్టీకి హిందీ భాషపై విముఖత లేదని.. అసలెందుకు బలవంతంగా హిందీ రుద్దుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మరాఠీ, ఇంగ్లీష్-మీడియం నేర్చుకుంటుండగా కొత్తగా చిన్న పిల్లలపై మూడో భాషగా హిందీ రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఉద్ధవ్ థాక్రే నిలదీశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడేట్టివార్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హిందీ ఐచ్ఛిక భాషగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని.. అంతేకాని తప్పనిసరి చేస్తే మాత్రం మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్లో మూడవ భాషగా హిందీ ఉండనుంది.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: మేయర్పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!
ఇప్పటికే తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ మాత్రం త్రిభాషా సూత్రాన్ని అంగీకరించమని తేల్చింది. ద్విభాషకే తమ మద్దతు అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై తమిళనాడులో డీఎంకే-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఈ పంచాయితీ మహారాష్ట్రకు పాకింది. ఇక్కడ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందుందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.
ఇది కూడా చదవండి:Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!