Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ జీవో.. ప్రతిపక్ష కూటమి అభ్యంతరం
- స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ జీవో
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష కూటమి
- ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదిలేదన్న ఉద్ధవ్ థాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Shocking: ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి.. పెళ్లికి 2 రోజుల ముందు కోమాలోకి..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలపై బలవంతంగా హిందీ రుద్దడాన్ని ఏ మాత్రం సహించబోమని ఆయన వ్యా్ఖ్యానించారు. తమ పార్టీకి హిందీ భాషపై విముఖత లేదని.. అసలెందుకు బలవంతంగా హిందీ రుద్దుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మరాఠీ, ఇంగ్లీష్-మీడియం నేర్చుకుంటుండగా కొత్తగా చిన్న పిల్లలపై మూడో భాషగా హిందీ రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఉద్ధవ్ థాక్రే నిలదీశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడేట్టివార్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హిందీ ఐచ్ఛిక భాషగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని.. అంతేకాని తప్పనిసరి చేస్తే మాత్రం మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్లో మూడవ భాషగా హిందీ ఉండనుంది.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: మేయర్పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!
ఇప్పటికే తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ మాత్రం త్రిభాషా సూత్రాన్ని అంగీకరించమని తేల్చింది. ద్విభాషకే తమ మద్దతు అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై తమిళనాడులో డీఎంకే-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఈ పంచాయితీ మహారాష్ట్రకు పాకింది. ఇక్కడ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందుందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.
ఇది కూడా చదవండి:Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!