Udaynidhi Stalin: ‘జై శ్రీరాం’ నినాదాలను ఖండించిన ఉదయనిధి.. ‘‘డెంగ్యూ మలేరియా దోమ’’తో పోల్చిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పోస్ట్ చేసిన ఉదయనిధి..‘‘ భారతదేశం క్రీడాస్పూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, క్రీడలు నిజమైన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా, దేశాలను ఏకం చేసే శక్తి ఉండాల, విద్వేషాలను వ్యాప్తి చేయడానికి సాధనంగా వాడొద్దు’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..
ఉదయనిధిపై బీజేపీ మరోసారి ఫైర్ అయింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎక్స్(ట్విట్టర్)లో ఉదయనిధిపై సెటైర్లు వేశారు. ఉదయనిధిని ఉద్దేశిస్తూ..‘‘ ద్వేషపూరిత డెంగ్యూ మలేరియా దోమ(ఉదయనిధి) విషాన్ని వ్యాప్తి చేయడానికి బయటకు వచ్చింది. ఒక మ్యాచ్ ఆపి నమాజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలగలేదు, మన భగవంతుడైన శ్రీరాముడిని విశ్వంలో ప్రతీమూలలో ఉన్నారు. జైశ్రీరాం అని జపించండి’’ అంటూ పోస్ట్ చేశారు.
కొన్ని రోజల క్రితం ఇలాగే సతనాన ధర్మంపై మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతనధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని దాన్ని తడిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే భాగస్వామి కావడంతో, కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!