Udaynidhi Stalin: ‘జై శ్రీరాం’ నినాదాలను ఖండించిన ఉదయనిధి.. ‘‘డెంగ్యూ మలేరియా దోమ’’తో పోల్చిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పోస్ట్ చేసిన ఉదయనిధి..‘‘ భారతదేశం క్రీడాస్పూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, క్రీడలు నిజమైన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా, దేశాలను ఏకం చేసే శక్తి ఉండాల, విద్వేషాలను వ్యాప్తి చేయడానికి సాధనంగా వాడొద్దు’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..
ఉదయనిధిపై బీజేపీ మరోసారి ఫైర్ అయింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎక్స్(ట్విట్టర్)లో ఉదయనిధిపై సెటైర్లు వేశారు. ఉదయనిధిని ఉద్దేశిస్తూ..‘‘ ద్వేషపూరిత డెంగ్యూ మలేరియా దోమ(ఉదయనిధి) విషాన్ని వ్యాప్తి చేయడానికి బయటకు వచ్చింది. ఒక మ్యాచ్ ఆపి నమాజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలగలేదు, మన భగవంతుడైన శ్రీరాముడిని విశ్వంలో ప్రతీమూలలో ఉన్నారు. జైశ్రీరాం అని జపించండి’’ అంటూ పోస్ట్ చేశారు.
కొన్ని రోజల క్రితం ఇలాగే సతనాన ధర్మంపై మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతనధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని దాన్ని తడిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే భాగస్వామి కావడంతో, కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!