Udaynidhi Stalin: ‘జై శ్రీరాం’ నినాదాలను ఖండించిన ఉదయనిధి.. ‘‘డెంగ్యూ మలేరియా దోమ’’తో పోల్చిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పోస్ట్ చేసిన ఉదయనిధి..‘‘ భారతదేశం క్రీడాస్పూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, క్రీడలు నిజమైన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా, దేశాలను ఏకం చేసే శక్తి ఉండాల, విద్వేషాలను వ్యాప్తి చేయడానికి సాధనంగా వాడొద్దు’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
Read Also: Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..
ఉదయనిధిపై బీజేపీ మరోసారి ఫైర్ అయింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎక్స్(ట్విట్టర్)లో ఉదయనిధిపై సెటైర్లు వేశారు. ఉదయనిధిని ఉద్దేశిస్తూ..‘‘ ద్వేషపూరిత డెంగ్యూ మలేరియా దోమ(ఉదయనిధి) విషాన్ని వ్యాప్తి చేయడానికి బయటకు వచ్చింది. ఒక మ్యాచ్ ఆపి నమాజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలగలేదు, మన భగవంతుడైన శ్రీరాముడిని విశ్వంలో ప్రతీమూలలో ఉన్నారు. జైశ్రీరాం అని జపించండి’’ అంటూ పోస్ట్ చేశారు.
కొన్ని రోజల క్రితం ఇలాగే సతనాన ధర్మంపై మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతనధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని దాన్ని తడిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే భాగస్వామి కావడంతో, కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్పై ఎంత ఆఫర్?
-
Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్తో భారీ అప్డేట్!
-
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
-
Isakapatnam: తెలుగు వెబ్ సిరీస్కు దేశవ్యాప్తంగా క్రేజ్… టాప్ 3లో దూసుకెళ్తున్న ‘ఇసకపట్నం’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!