UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- ఒపెక్ నుంచి యూఏఈ ఎగ్జిట్..
- భారత్కు ప్రయోజనం, పాక్కు ప్రాణ సంకటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE OPEC Exit: పాకిస్తాన్-సౌదీ అరేబియా కూటమికి వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సౌదీ ఆధిపత్యం ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుండి బయటకు వచ్చింది. ఇది సౌదీతో పాటు గల్ఫ్ దేశాలకు పెద్ద దెబ్బగా అభివర్ణించవచ్చు. ఈ వ్యవహారం భారత్కు ప్రయోజనం, పాకిస్తాన్కు కష్టమైన పరిస్థితిని కల్పిస్తుంది.
భారత్కు లాభం .. పాక్కు నష్టం..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ఈ మొత్తం వ్యవహారాన్ని భారత్ దృష్టితో చూస్తే, ఈ నిర్ణయం భారత్కు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యూఏఈ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రపంచ చమురు మార్కెట్కు అనుకూలంగా చమురును పెంచొచ్చు. తద్వార ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి ముందు ఒపెక్ కూటమి తమ లాభాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని తగ్గించేది, పెంచేది. అలాగే ధరల్ని కూడా నియంత్రించేంది. ఇప్పుడు యూఏఈ ఈ కూటమి నుంచి బయటకు రావడంతో తన ఇష్టానికి అనుగుణంగా ఉత్పత్తి చేయొచ్చు.
భారత్, యూఏఈకి మంచి మిత్రదేశం. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా భారత్ విస్తారంగా యూఏఈ ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. ఇదే సమయంలో భారత్ సౌదీ అరేబియా-పాకిస్తాన్ కూటమిని ఇబ్బంది పెడుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి దేశం సౌదీ నుంచి చమురు కొనుగోలు చేయకుంటే ఆ దేశానికే నష్టం. ఈ పరిణామాలు యూఏఈకి లాభం చేకూరుస్తాయి. ఇన్నాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పాకిస్తాన్ ముస్లిం ఐడెంటిటీని చూపుతూ యూఏఈ నుంచి డబ్బులు తీసుకునేది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. యూఏఈ పాక్కు డబ్బులు ఇవ్వదు.
పాక్-సౌదీలపై యూఏఈ ఆగ్రహం:
మిత్రదేశాలుగా ఉన్న యూఏఈ, సౌదీ అరేబియాల మధ్య ఇటీవల కాలంతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. యెమెన్ రాజకీయాల్లో ఇరు దేశాల మధ్య చిచ్చు రగిలింది. యెమెన్లో రెండు వేర్వేరు అధికార కేంద్రాలకు ఇరు దేశాల మద్దతు ఇచ్చాయి. దీంతో ఘర్షణ ప్రారంభమైంది. ఇక సూడాన్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా యూఏఈ, సౌదీలు వేర్వేరు కూటముల పక్షాన నిలిచాయి.
ఇక ఇటీవల ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇంత దాడులు జరుగుతున్న సౌదీ కానీ, మధ్యవర్తిగా ఉన్న పాక్ కానీ స్పందించలేదు. ఇరాన్పై మెతక వైఖరిని అవలంభించాయి. దీంతో, నిజంగా యుద్ధం వస్తే తమకు ఏ ఇస్లామిక్ దేశం కూడా అండగా నిలవదనే సత్యం యూఏఈకి అర్థమైంది. దాడులు చేస్తున్నా అమెరికా పట్టించుకోలేదని వాదన ఉంది. దీంతో ఇకపై తన దారి తాను చూసుకోవాలని యూఏఈ భావిస్తోంది. సౌదీ-పాకిస్తాన్ సైనిక కూటమి కూడా తమకు వ్యతిరేకం అవుతుందని యూఏఈ భావిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!