Cyber Terror Activities: ప్రభుత్వ వెబ్సైట్పై సైబర్ దాడి.. భారత వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్టు
- ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లపై సైబర్ దాడి..
- సైబర్ దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్..
- గుజరాత్ కు చెందిన ఓ మైనర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్లోని ఖేడా జిల్లాలోని నదియాద్ కు చెందిన ఒక మైనర్ బాలుడితో పాటు జసీమ్ షానవాజ్ అన్సారీ గుర్తించారు. వీరు ఇద్దరూ టెలిగ్రామ్ ఛానెల్ నడుపుతున్నారు.. అక్కడి నుంచి వారు తమ హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారని తెలిపారు.
Read Also: Bengaluru Big Alert: బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్ల హ్యాకింగ్ గురించి ఇన్స్పెక్టర్ డీబీ ప్రజాపతికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అన్నారు. నిందితుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.. విచారణలో జాసిమ్ అన్సారీతో పాటు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు.. వారి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించామని చెప్పుకొచ్చారు. వీరి ఇద్దరు ఎన్క్రిప్టెడ్ చాట్లను ఎలా హ్యాక్ చేయాలో అనేది తెలుసని దర్యాప్తులో తేలింది అన్నారు.
Read Also: CM Chandrababu: గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు..
అయితే, ఈ ఇద్దరు భారత ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి ప్రయత్నించారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి తెలిపారు. EXPLOITXSEC ఛానెల్ కోసం ELITEXPLOIT అనే బ్యాకప్ టెలిగ్రామ్ ఛానెల్ను సృష్టించారని, @BYTEXPOIT అనే IDని ఉపయోగించి దానిని Anonsec అని పేరు మార్చారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా 50కి పైగ సార్లు భారత ప్రభుత్వ వెబ్సైట్లపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలను వారి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశారని అన్నారు.. ఇక, ఈ ఇద్దరిపై ఐటీ చట్టం సెక్షన్లు 43, 66(f) కింద కేసు నమోదు చేయబడింది. నిందితులకు ఎవరు సహాయం చేశారు, వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందిందా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. వీరి ఇరువురి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు.
తాజావార్తలు
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!