Cyber Terror Activities: ప్రభుత్వ వెబ్సైట్పై సైబర్ దాడి.. భారత వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్టు
- ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లపై సైబర్ దాడి..
- సైబర్ దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్..
- గుజరాత్ కు చెందిన ఓ మైనర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్లోని ఖేడా జిల్లాలోని నదియాద్ కు చెందిన ఒక మైనర్ బాలుడితో పాటు జసీమ్ షానవాజ్ అన్సారీ గుర్తించారు. వీరు ఇద్దరూ టెలిగ్రామ్ ఛానెల్ నడుపుతున్నారు.. అక్కడి నుంచి వారు తమ హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారని తెలిపారు.
Read Also: Bengaluru Big Alert: బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్ల హ్యాకింగ్ గురించి ఇన్స్పెక్టర్ డీబీ ప్రజాపతికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అన్నారు. నిందితుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.. విచారణలో జాసిమ్ అన్సారీతో పాటు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు.. వారి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించామని చెప్పుకొచ్చారు. వీరి ఇద్దరు ఎన్క్రిప్టెడ్ చాట్లను ఎలా హ్యాక్ చేయాలో అనేది తెలుసని దర్యాప్తులో తేలింది అన్నారు.
Read Also: CM Chandrababu: గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు..
అయితే, ఈ ఇద్దరు భారత ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి ప్రయత్నించారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి తెలిపారు. EXPLOITXSEC ఛానెల్ కోసం ELITEXPLOIT అనే బ్యాకప్ టెలిగ్రామ్ ఛానెల్ను సృష్టించారని, @BYTEXPOIT అనే IDని ఉపయోగించి దానిని Anonsec అని పేరు మార్చారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా 50కి పైగ సార్లు భారత ప్రభుత్వ వెబ్సైట్లపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలను వారి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశారని అన్నారు.. ఇక, ఈ ఇద్దరిపై ఐటీ చట్టం సెక్షన్లు 43, 66(f) కింద కేసు నమోదు చేయబడింది. నిందితులకు ఎవరు సహాయం చేశారు, వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందిందా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. వీరి ఇరువురి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!