Bengaluru Big Alert: బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
- బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్
- కేంద్ర వాతావరణ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్
- బెంగళూరు సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా బెంగళూరు, ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కురిసిన కుండపోత వర్షానికి ఇప్పటికే బెంగళూరు నగరం అతలాకుతలం అయింది. అలాగే మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆర్థిక రాజధాని ముంబై కూడా నీట మునిగింది.
తాజాగా కేంద్ర వాతావరణ శాఖ బెంగళూరుకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం బెంగళూరులో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇది కూడా చదవండి: Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఇప్పటికే బెంగళూరు నగరం మునిగిపోయింది. ఇంతలోనే మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్ నంబర్ -1533ను ఉపయోగించుకోవాలని పౌర సంస్థ సూచించింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
ఇదిలా ఉంటే కర్ణాటకలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో నగరం తీవ్ర జలమయం అయింది. ఆస్తి నష్టం, ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్, హోసూర్ రోడ్, బీటీఎం లేఅవుట్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి వాహనాలు నిలిచిపోయాయి. ఇక వర్షాలు కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు.
బీజేపీ విమర్శ..
ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా హస్తం నేతలు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలపై బీజేపీ ధ్వజమెత్తింది. ఓ వైపు భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అయి ప్రాణాలు పోతుంటే.. కాంగ్రెస్ నేతలు వేడుకలు జరుపుకుంటారా? అని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుఫాన్..
ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ మే 21న తీరం దాటే అవకాశం ఉంది. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రోజల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక ఐటీ కంపెనీలు.. ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయాలని సూచించాయి.
తాజావార్తలు
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!