Bangladesh: భారతదేశ బస్సుపై దాడి.. బకాయిలు కట్టాలని బంగ్లాదేశ్కి త్రిపుర ఆదేశం..
- బంగ్లాదేశ్కి త్రిపుర షాక్..
- విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం..
- భారతదేశ బస్సుపై దాడి తర్వాత చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి.
Read Also: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
Also Read
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఆ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్కి భారత్ షాక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని బంగ్లాదేశ్ని కోరింది. రూ. 135 కోట్ల విద్యుత్ బకాయిలను క్లియర్ చేయాలని కోరింది. బంగ్లాదేశ్లోని బ్రహ్మణబారియా జిల్లాలో శనివారం ఢాకా మీదుకు ప్రయాణిస్తున్న అగర్తలా-కలకత్తా బస్సుపై దాడి జరిగిన తర్వాత ఈ చర్య వచ్చింది. బస్సుపై దాడి చేసి భారత వ్యతిరేక నినాదలు చేశారు.
త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ.. 35 కోట్లు బకాయి ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది. ప్రతి యూనిట్ విద్యుత్కు, మేము రూ. 6.65 వసూలు చేస్తున్నాము, ఇది మనకు లభించే దానితో పోలిస్తే మంచి రేటiని ఆయన అన్నారు. ఇలాంటి సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరాని పరిమితం చేసింది. ఒక ఏడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం.. బంగ్లాదేశ్ త్రిపుర నుంచి 160 మెగావాట్ల కరెంట్ని పొందే అర్హత ఉంది. ఈ ట్రేడింగ్ని ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్(ఎన్వీవీసీ) పర్యవేక్షిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!