Bangladesh: భారతదేశ బస్సుపై దాడి.. బకాయిలు కట్టాలని బంగ్లాదేశ్కి త్రిపుర ఆదేశం..
- బంగ్లాదేశ్కి త్రిపుర షాక్..
- విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం..
- భారతదేశ బస్సుపై దాడి తర్వాత చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి.
Read Also: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఆ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్కి భారత్ షాక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని బంగ్లాదేశ్ని కోరింది. రూ. 135 కోట్ల విద్యుత్ బకాయిలను క్లియర్ చేయాలని కోరింది. బంగ్లాదేశ్లోని బ్రహ్మణబారియా జిల్లాలో శనివారం ఢాకా మీదుకు ప్రయాణిస్తున్న అగర్తలా-కలకత్తా బస్సుపై దాడి జరిగిన తర్వాత ఈ చర్య వచ్చింది. బస్సుపై దాడి చేసి భారత వ్యతిరేక నినాదలు చేశారు.
త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ.. 35 కోట్లు బకాయి ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది. ప్రతి యూనిట్ విద్యుత్కు, మేము రూ. 6.65 వసూలు చేస్తున్నాము, ఇది మనకు లభించే దానితో పోలిస్తే మంచి రేటiని ఆయన అన్నారు. ఇలాంటి సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరాని పరిమితం చేసింది. ఒక ఏడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం.. బంగ్లాదేశ్ త్రిపుర నుంచి 160 మెగావాట్ల కరెంట్ని పొందే అర్హత ఉంది. ఈ ట్రేడింగ్ని ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్(ఎన్వీవీసీ) పర్యవేక్షిస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..