Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
- భారత్-అమెరికా మధ్య శుభపరిణామం
- త్వరలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనువెంటనే మోడీ కూడా రిప్లై ఇచ్చారు. తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. రెండు దేశాల భాగస్వామ్యం చాలా గొప్పదిగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ చర్చలు త్వరలోనే జరుగుతాయని అధికార వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈసారి చర్చలు జరిగితే ఢిల్లీలోనే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు
పాడి, వ్యవసాయంపై అమెరికా రాయితీలు కోరుతోంది. కానీ ఈ రెండు కూడా భారతదేశానికి జీవనాడి. ఈ నేపథ్యంలో రాయితీలు ఇచ్చేందుకు భారత్ మొగ్గు చూపడం లేదు. దీంతో చర్చలు ప్రతిష్టంభన చోటుచేసుకున్నాయి. కొత్త చర్చలు అక్టోబర్లో జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్నదాతలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒప్పుకోకూడదని భారత్ భావిస్తోంది. చౌకైన అమెరికా వస్తువులు దిగుమతి అయితే భారతీయ పాడి, వ్యవసాయం దెబ్బతింటోందని భారత్ ఆలోచిస్తోంది.
మొక్కజొన్న, సోయాబీన్స్, ఆపిల్, బాదం, ఇథనాల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే ప్రతిపాదనలను కూడా భారతదేశం తోసిపుస్తోంది. అనుమతిస్తే భారత రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఢిల్లీ భావిస్తోంది. ఒకవేళ అమెరికా నుంచి సానుకూల నిర్ణయం లేకపోతే భారత్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయినా కూడా రాత్రికి రాత్రే విభేదాలు పరిష్కరించబడవని ఒక సీనియర్ అమెరికా అధికారి అన్నారు.
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా ట్రంప్ మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అన్నదాతల కోసం ఎంత భారమైనా భరిస్తామని మోడీ ప్రకటించారు.

India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl
— Narendra Modi (@narendramodi) September 10, 2025
- Tags
- america
- india
- PM Modi
- Trade talks
- trump
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!