Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు అనుకూలంగా చెక్ రిపబ్లిక్ కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగంతో నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను అక్కడి జైలులో ఉన్నారు. ఈ కేసులో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు చెక్ అధికారులు నిఖిల్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అమెరికా అతడిని అప్పగించాలని చెక్ కోర్టులను కోరుతూ వస్తోంది. అయితే తనను అప్పగించవద్దని కోరుతూ నిఖిల్ గుప్తా వేసిన పిటిషన్ని చెక్ రిపబ్లిక్ అత్యున్నత కోర్టు అయిన రాజ్యాంగ కోర్టు బుధవారం తిరస్కరించింది.
52 ఏళ్ల భారతీయుడు నిఖిల్ గుప్తా, అమెరికా గడ్డపై అమెరికా జాతీయుడైన గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను పన్నూను హతమార్చేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేశారని ఆరోపిస్తూ అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తా అరెస్ట్ చేయబడ్డాడు. అతడిని అప్పగించాలని అమెరికా కోరుతోంది.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
Read Also: Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!
అప్పగింతకు వ్యతిరేకంగా నిఖిల్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ని చెక్ రాజ్యాంగ న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు, స్వేచ్చలను ఉల్లఘించబడుతున్నట్లు రాజ్యాంగ న్యాయస్థానం గుర్తించలేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణకు ముందు నిర్భంధం నుంచి విడుదల చేయాలని గుప్తా చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించడానికి రాజ్యాంగ కోర్టు సమర్థించింది. అంతకుముందు జనవరిలో చెక్ హైకోర్టు గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని తీర్పుచెప్పింది. గుప్తాను అప్పగించాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి పావెల్ బ్లేజెక్ తుది నిర్ణయం తీసుకుంటారు.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) అధికారి విక్రమ్ యాదవ్ ఈ ప్లాట్ వెనుక భారతీయ అధికారి అని వాషింగ్టన్ పోస్ట్ ఏప్రిల్ 2024లో నివేదించింది. అప్పటి రా చీఫ్ సమంత్ గోయెల్ ఈ ఆపరేషన్కి అనుమతి ఇచ్చారని పేపర్ పేర్కొంది. అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది. పన్నూన్ చంపే కుట్రలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని అసమర్థ, నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!