Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు అనుకూలంగా చెక్ రిపబ్లిక్ కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగంతో నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను అక్కడి జైలులో ఉన్నారు. ఈ కేసులో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు చెక్ అధికారులు నిఖిల్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అమెరికా అతడిని అప్పగించాలని చెక్ కోర్టులను కోరుతూ వస్తోంది. అయితే తనను అప్పగించవద్దని కోరుతూ నిఖిల్ గుప్తా వేసిన పిటిషన్ని చెక్ రిపబ్లిక్ అత్యున్నత కోర్టు అయిన రాజ్యాంగ కోర్టు బుధవారం తిరస్కరించింది.
52 ఏళ్ల భారతీయుడు నిఖిల్ గుప్తా, అమెరికా గడ్డపై అమెరికా జాతీయుడైన గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను పన్నూను హతమార్చేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేశారని ఆరోపిస్తూ అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తా అరెస్ట్ చేయబడ్డాడు. అతడిని అప్పగించాలని అమెరికా కోరుతోంది.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read Also: Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!
అప్పగింతకు వ్యతిరేకంగా నిఖిల్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ని చెక్ రాజ్యాంగ న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు, స్వేచ్చలను ఉల్లఘించబడుతున్నట్లు రాజ్యాంగ న్యాయస్థానం గుర్తించలేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణకు ముందు నిర్భంధం నుంచి విడుదల చేయాలని గుప్తా చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించడానికి రాజ్యాంగ కోర్టు సమర్థించింది. అంతకుముందు జనవరిలో చెక్ హైకోర్టు గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని తీర్పుచెప్పింది. గుప్తాను అప్పగించాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి పావెల్ బ్లేజెక్ తుది నిర్ణయం తీసుకుంటారు.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) అధికారి విక్రమ్ యాదవ్ ఈ ప్లాట్ వెనుక భారతీయ అధికారి అని వాషింగ్టన్ పోస్ట్ ఏప్రిల్ 2024లో నివేదించింది. అప్పటి రా చీఫ్ సమంత్ గోయెల్ ఈ ఆపరేషన్కి అనుమతి ఇచ్చారని పేపర్ పేర్కొంది. అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది. పన్నూన్ చంపే కుట్రలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని అసమర్థ, నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!