Congress: పహల్గామ్ ఉగ్ర దాడితో కాంగ్రెస్లో విభేదాలు.. పార్టీ లైన్ దాటొద్దన్న ఏఐసీసీ
- పహల్గామ్ ఉగ్ర దాడితో కాంగ్రెస్ లో విభేదాలు..
- శశిథరూర్- ఉదిత్ రామ్ మధ్య కొనసాగుతున్న మాటలయుద్ధం..
- పార్టీ లైన్ కి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఏఐసీసీ ఆదేశాలు..
Congress: పహల్గాం ఉగ్రదాడితో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఇంటలిజెన్స్ లో సాధారణంగా లోపాలు జరుగుతుంటాయి.. ప్రతి ఒక్కరు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. యుద్దం ముగిసే వరకు జవాబుదారీతనం అడగకూడదని అన్నారు. ఏ దేశం కూడా వందశాతం ఇంటలిజెన్స్ ను సేకరించలేదని తెలిపారు. ఇక, ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7వ తేదీ నాటి దాడులతో వీటిని పోల్చారు ఎంపీ శశిథరూర్.
Read Also: Single Trailer : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్..
Also Read
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
కాగా, శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న విధేయతను ప్రశ్నించారు. శశిథరూర్ తన పార్టీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారా? లేక అధికార భారతీయ జనతా పార్టీతో ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. శశిథరూర్ ‘‘సూపర్ బీజేపీ మనిషి’’గా మారడానికి ప్రయత్నిస్తున్నారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను బీజేపీ ప్రతినిధిగా నియమించిందా? అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన 26/11 ముంబై దాడులను భద్రతా లోపాలుగా గతంలో బీజేపీ తీవ్రంగా విమర్శించిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే నిఘా వైఫల్యాలను ఆయన సమర్థించడాన్ని ఖండించారు. నిఘా లోపాలను కప్పి పుచ్చడానికి బదులుగా పీఓకేను తిరిగి తీసుకోవాలని కేంద్రానికి సూచించమన్నారు ఉదిత్ రాజ్.
Read Also: Menstrual Problems: రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!
ఇక, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్ర దాడి అంశంపై ఎవరు కూడా బహిరంగ ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ నాయకత్వం సోమవారం పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ ప్రకటించిన వైఖరికి కట్టుబడి ఉండాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
#WATCH | Thiruvananthapuram, Kerala | On the Pahalgam terror attack, Congress MP Shashi Tharoor says, "Obviously, there was no full proof intelligence. There was some failure… But we have got the example of Israel, the world's best intelligence services according to everybody,… pic.twitter.com/v0SMkULt6i
— ANI (@ANI) April 27, 2025
शशि थरूर ने कहा किसी देश के पास 100% फुलप्रूफ इंटेलिजेंस नहीं?
26/11 मुंबई हमले के समय मोदी जी गुजरात से मुंबई पहुंचकर कहा था कि केंद्र सरकार की असफलता है । यह भी कहा था समस्या केंद्र है सीमा पर नहीं ।कैसे आतंकी आए जब खुफिया, बीएसएफ, सीआरपीएफ केंद्र के पास है । थरूर जी मोदी जी…
— Dr. Udit Raj (@Dr_Uditraj) April 28, 2025
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!