Arvind Kejriwal: కేజ్రీవాల్ షుగర్ వ్యాధిపై లెఫ్టినెంట్ గవర్నర్కి నివేదిక.. తెలంగాణతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. తాజాగా ఆయన షుగర్ వ్యాధి, ఇన్సులిన్ వాడకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తీహార్ జైల్ అధికారులు నివేదిక పంపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఇన్సులిన్ తీసుకోవడం మానేశారని, మధుమేహానికి సంబంధించి నోటి ద్వారా తీసుకునే మెడిసిన్స్ వాడుతున్నారని ఎల్జీకి ఇచ్చిన రిపోర్టును ఉటంకిస్తూ శనివారం అధికారులు తెలిపారు.
తెలంగాణ బేస్డ్ ప్రైవేట్ క్లీనిక్ కేజ్రీవాల్కి చికిత్స ఇస్తోంది. తెలంగాణకు చెందిన డాక్టర్ సలహా ప్రకారం కేజ్రీవాల్ ఇన్సులిన్-రివర్సల్ ప్రోగ్రామ్లో ఉన్నారు. అరెస్టుకు చాలా ముందే ఇన్సులిన్ డోసులని నిలిపేశారని తీహార్ జైలు నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఆప్ నేత, మంత్రి అతిషి స్పందిస్తూ.. నివేదిక బీజేపీ కుట్రను బహిర్గతం చేసిందని ఆరోపించారు. బీజేపీ పిలుపు మేరకు కేజ్రీవాల్ని జైల్లోనే చంపేందుకు కుట్ర జరుగుతోందని, 12 ఏళ్లుగా సీఎం ఇన్సులిన్ తీసుకుంటున్నారరని, ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి తీహార్ అధికారులకు ఇబ్బంది ఏమిటి..? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లే ముందు కూడా కేజ్రీవాల్ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకునేవారని ఆమె అన్నారు.
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
Read Also: Nagari: మంత్రి రోజాకు షాక్.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..
తెలంగాణకు చెందిన వైద్యుడి పర్యవేక్షణలో కేజ్రీవాల్ మధుమేహ చికిత్స నడుస్తోందని, కొన్ని నెలల క్రితమే అతను ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని, అరెస్ట్ చేసిన సమయంలో ఆయన మెట్ఫార్మిన్ అనే బేసిక్ షుగర్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారని తీహార్ నివేదిక తెలియజేస్తోంది. తీహార్ జైలులో వైద్య పరీక్షల సమయంలో కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నానని, కొన్ని నెలల ముందు నుంచి తీసుకోవడం మానేశానని వైద్యులతో చెప్పారని నివేదిక పేర్కొంది.
‘‘ తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ క్లీనిక్లో కేజ్రీవాల్ చికిత్స తీసుకోవడం ఆసక్తికరమైన కేసు. ఢిల్లీలో ప్రపంచ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి గొప్పగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి, వైద్య పత్రాలను కూడా అందించడంలో విఫలమైన దక్షిణ భారతదేశంలోని క్లినిక్లో రహస్యంగా చికిత్స పొందుతున్నారు.’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ముఖ్యంగా ఎక్సై్జ్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టు చుట్టూ ఉన్న మొత్తం ఎపిసోడ్లో ఈ తెలంగాణ క్లినిక్ ప్రవేశం, మద్యం పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించడం ఈ రెండు విషయాలు దగ్గరగా ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి వైద్యులు వైద్య రికార్డుల ప్రకారం.. కేజ్రీవాల్కి ఎలాంటి ఇన్సులిన్ సూచించలేదు అని నివేదిక తెలిపింది. అతడి షుగర్ లెవల్స్ ఆందోళనకరంగా లేవని, ప్రస్తుతం ఇన్సులిన్ అవసరం లేదని సూచించారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి స్వీట్లు, మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడని, మెడికల్ బెయిల్ పొందడానికి ఇలా చేస్తున్నాడని ఈడీ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!