S Jaishankar: చైనాతో సంబంధాలు సరిగా లేవు.. విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రి ఒకరోజు ముందు కీలక కామెంట్స్ చేశారు. దీని తర్వాతి రోజే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా తీరుపై ధ్వజమెత్తారు. సరిహద్దు ఒప్పందాలు ఉల్లంఘించిన కారణంగా చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్, చైనా మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటోందని అన్నారు. కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Shivraj Singh Chouhan: ప్రధాని మోడీ “నీలకంఠుడు”.. విషసర్పం విమర్శలకు కౌంటర్..
Also Read
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
అమెరికా, యూరప్, రష్యా, జపాన్ ఇలా ఏ దేశంతో అయినా ద్వైపాక్షిక సంబంధాలను భారత్ కోరుకుంటోందని, ఆగ్నేయాసియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ‘ యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకువచ్చామని, దీంతో పాటు ఇండో పసిఫిక్ రీజియన్ లో అన్ని దేశాలతో సంబంధాలను ఏర్పరుచుకున్నానమి జైశంకర్ అన్నారు. క్వాడ్ లో సభ్యదేశంగా ఉంటూ ఇండో పసిఫిక్ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఐటూయూటూ( ఇండియా, ఇజ్రాయిల్, యూఏఈ, యూఎస్ఏ)లో సభ్యదేశంగా ఉన్నామని తెలిపారు.
పొరుగు దేశాల అభివృద్ధికి భారత్ కృషి చేస్తోందని, కోవిడ్ సంక్షోభంలో కూడా శ్రీలంకకు సహకరించామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ వంటి దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం కష్టం అని స్పష్టం చేశారు. గురువారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి లీషాంగ్ పుతో సమావేశం అయ్యారు. సరిహద్దుల ఉల్లంఘనల గురించి చైనాను భారత్ హెచ్చరించింది. సరిహద్దు వెంబడి చైనా సైన్యాన్ని మోహరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటం వంటి ఘటనలపై భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది.
తాజావార్తలు
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!