Yogi Adityanath: ఆడపిల్లల్ని వేధిస్తే రావణుడి గతి తప్పదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలోని కుమార్తెల భద్రతకు హాని కలిగించే ప్రయత్నం చేసేవారు రావణుడి పరిస్థితి ఎదుర్కొంటారని శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు. బల్లియా జిల్లాలోని బన్స్దీహ్లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళన్లో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, ‘ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన’ను రాబోయే సెషన్ నుండి రూ. 25,000 ఇవ్వడం ద్వారా రాష్ట్ర కుమార్తెల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడానికి నిబద్ధతతో ఉందని ఆయన అన్నారు. ఈ డబ్బును ఆరు దశల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు అందచేస్తామని ఆయన అన్నారు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన’ కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..
ఈ సందర్భంగా బల్లియాలో రూ. 129 కోట్లతో చేపట్టిన 35 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అర్హులకు ధ్రువపత్రాలను అందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం దీపావళి రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తుందని, వంట పొయ్యిల నుంచి వచ్చే పొగ హానికరమైన ప్రభావాల నుంచి రాష్ట్ర మహిళలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1.75 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం పొందుతారని యోగీ తెలిపారు.
2026 డీలిమిటేషన్ తర్వాత లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇందుకు ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పాలని ఆయన అన్నారు. మహిళల భద్రత, గౌరవం మరియు స్వావలంబనను నిర్ధారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని నొక్కిచెప్పిన ఆదిత్యనాథ్, తమ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు బలగాలలో 20 శాతం మహిళా సిబ్బందిని ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేసేలా వ్యవహరిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!