Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఈ యుద్ధంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇరువురు నేతల భద్రత, మానవత పరిస్థితులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే అని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Ayodhya Ram Mandir: రామమందిరంలో “రాజీవ్ గాంధీ” పాత్ర.. కమల్నాథ్ వ్యాఖ్యలపై దుమారం..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
‘‘పశ్చిమాసియా పరిస్థితులపై యూఏఈ అధ్యక్షుడు, నా సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో మాట్లాడాను. తీవ్రవాదం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, పౌర ప్రాణనష్టంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాము. భద్రత, మానవతావాద పరిస్థితుల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని మేము అంగీకరిస్తున్నాము. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వంపై ప్రతీ ఒక్కరి ఆసక్తి ఉంది’’ అని పీఎం మోడీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని అంతా భయపడుతున్నారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి గాజా నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు 1400 మందిని ఘోరంగా చంపేశారు. ఆ తరువాత నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ ని పూర్తిగా ధ్వంసం చేసేదాకా తగ్గదే లేదని ఇజ్రాయిల్ చెబుతోంది. ఇప్పటికే గాజా నగరాన్ని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9227కి చేరిందని గాజాలోని హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Had a good conversation with my brother HH @MohamedBinZayed, President of UAE, on the West Asia situation. We share deep concerns at the terrorism, deteriorating security situation and loss of civilian lives. We agree on the need for early resolution of the security and…
— Narendra Modi (@narendramodi) November 3, 2023
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?