Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News This Time Common People Are The Cheap Guests For The 15th Of August The Center Invited 1800 People

Independence Day Celebrations: ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీఫ్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం

Published Date :August 14, 2023 , 11:48 am
By Naga Maneendra
Independence Day Celebrations:  ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీఫ్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Independence Day Celebrations: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి వేరే దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించలేదు. దేశంలోని సామాన్యులనే చీప్‌గెస్టులుగా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 1800 మంది వరకు ఆహ్వానాలను సైతం కేంద్ర ప్రభుత్వం పంపించింది. రేపు ఢిల్లీలో జరిగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామాన్యులే చీప్‌గెస్టులుగా హాజరవుతున్నారు. వివిధ రంగాల్లో ఉన్న వారిని ముఖ్య అతిధులుగా పిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నారు.

Read also: Rowdy Sheeter: బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రేపు పదోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగియనున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న మోడీ భావన నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. వారిలో
400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాలవారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన లబ్ధిదారులు, సెంట్రల్‌ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్‌ జల్‌ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం పంచుకోనున్నారు. వారివారి సంప్రదాయ దుస్తుల్లో స్వాతంత్య్రోత్సవాల్లో పాల్గొనడానికి ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను కూడా ఆహ్వానించారు. వేడుకలకు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు వెయ్యి ఏర్పాటు చేశారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. హర్యానాలో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. వేడుకలు జరిగే సమయంలో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.

Read also: Virupaksha team : మళ్ళీ జట్టు కట్టిన విరూపాక్ష టీం.. ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారుగా

ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పెషల్‌గా సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలతో ముడిపడిన వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా జాతీయ యుద్ధ స్మారక కేంద్రం, ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌, ప్రగతిమైదాన్‌, రాజ్‌ఘాట్‌, మరికొన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక సెల్ఫీపాయింట్లు ఏర్పాటుచేశారు. భారత్‌ పట్ల ప్రపంచం పెట్టుకున్న ఆశలు, వ్యాక్సిన్‌ విజయాలు, యోగా, ఉజ్వల యోజన, అంతరిక్ష రంగంలో ఇండియా సత్తా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలు, ఇతివృత్తాలను వీటికోసం ఎంచుకున్నారు. మైగవ్‌(My Gov) పోర్టల్‌లో ఆగస్టు 15-20 మధ్య ఆన్‌లైన్‌ సెల్ఫీ పోటీలను రక్షణశాఖ నిర్వహిస్తుంది. ప్రజలెవరైనా 12 ప్రసిద్ధ కేంద్రాల వద్ద తీసుకున్న ఒకటి, అంతకుమించిన సెల్ఫీలు అప్‌లోడ్‌చేస్తే అందులో ప్రతి కేంద్రం నుంచి 12 మంది విజేతలను ఎంపికచేసి, వారికి రూ.10వేల చొప్పున నగదు బహుమతిగా అందజేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1800 People.
  • Celebrations
  • chief guests
  • common people
  • Independence Day

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions