Lalu on Modi: కేసులతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు.. మోడీపై లాలూ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu on Modi: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫైరయ్యారు. ఒక కేసు తరువాత మరొక కేసుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ప్రధాని మోడీపై ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. కేసులతో తమను బెదిరించలేరని స్పష్టం చేశారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో తనతోనాటు తన భార్య రబ్రీ దేవి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తదితరులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం స్పందించారు. రైల్వేశాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
Read also: Extramarital Affair: అత్తతో ఎఫైర్.. ఒరేయ్ ఫ్రెండ్గా, ఎంత పని చేశావ్రా?
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ఆర్జేడీ 27వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవంలో లాలూ ప్రసాద్ మాట్లాడుతూ ఒక కేసు తర్వాత మరొక కేసు తనపైనా, తన కుటుంబ సభ్యులపై పెడుతున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఐక్యత తేవడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశంసించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఇందుకు సంబంధించి ముందుగా జరిగే పరిణామాలను కర్ణాటక తెలియచెప్పిందని లాలూ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి దూరమైందని.. ఇప్పటికీ బీజేపీ బేరసారాలకు పాల్పడుతుందని పరోక్షంగా మహారాష్ట్ర పరిణామాలపై లాలూ వ్యాఖ్యానించారు.
Read also: Lust Stories 3 : త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న మేకర్స్..?
`విపక్షాల మధ్య ఐక్యతకు బీహార్లో మహాఘట్బంధన్ మంచి ఉదాహరణ అన్నారు. అంబేద్కర్ వారసత్వంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్న మతతత్వానికి వ్యతిరేకంగా అందరం ధృడంగా పోరాడాల్సిన అవసరం ఉందని లాలూ పేర్కొన్నారు. 2004-09 మధ్య కాలంలో రైల్వేశాఖ మంత్రిగా లాలూ పని చేసినప్పుడు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో గ్రూప్-డీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. ఉద్యోగాలు పొందిన వారి నుంచి లాలూ కుటుంబం.. వారి సన్నిహితులు భూమి గిఫ్ట్గా పొందారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
- Tags
- fire
- harassing
- Lalu
- modi
- Our Family
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!