ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి మండలిలో 77 మంది ఉన్నారు. ఈ 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్లోనూ కొంతమంది నైపుణ్యం ఉన్న యువకులను, రిటైర్డ్ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలు తీసుకుని మెరుగైనా విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మం త్రుల పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నిపుణుల బృందం పనిచేస్తుందని తెలిపారు. మంత్రి మండలిని మొత్తం 8 గ్రూపులుగా విభజించే ప్రక్రియ అంతా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగింది. ” చింతన్ శివిర్” పేరుతో నిర్వహించిన ఈ సమావేశాలు ఒక్కొక్కటి దాదాపు ఐదు గంటల పాటు కొనసాగాయి.
వీటిలో వ్యక్తిగత సామర్థ్యం, సవ్యమైన పాలనను అందించేటట్టు, మంత్రిత్వ శాఖ పనితీరు, పార్టీ సమన్వయం, నైపుణ్యాలు పెంపొం దించే విధానాలు అనుసరించాల్సిన పార్లమెంటరీ పద్ధతులపై చర్చిం చారు. ఈ సమావేశాలకు పార్లమెంట్ ఉభయ సభాపతులు హాజర య్యారు. సమస్యలు ఎదుర్కొవడం, సమయపాలన వంటి తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పాలనలో నూతన సంస్కరణలు, వేగా న్ని పెంచడానికి ఈ బృందాలు పనిచేస్తాయని అధికా వర్గాలు పేర్కొన్నాయి.