The Kerala Story: మంత్రులతో కలిసి సినిమా చూడనున్న సీఎం యోగి.. మరోవైపు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తన మంత్రి వర్గంతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పిస్తున్నట్లు యోగి స్వయంగా ప్రకటించారు. దీని గురించి ఆయన హిందీలో ట్వీట్ చేశారు. యోగి క్యాబినెట్ మొత్తం ఈ సినిమాను చూడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో బీజేపీ పాలిత రాష్ట్ర ఉత్తరాఖండ్ కూడా ఈ సినిమాకు ‘టాక్స్ ఫ్రీ’ కల్పించేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. సీఎం ధామి మంగళవారం సాయంత్రం 5 గంటలకు డెహ్రాడూన్ లోని పీవీఆర్ థియేటర్ లో సినిమా చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రి గణేష్ జోషి కూడా ఉండనున్నారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Read Also: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
మూవీ మేకర్స్ కి బెదిరింపులు..
ఇదిలా ఉంటే ఈ సినిమాను కొన్ని వర్గాల ప్రజలు సమర్థిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సంస్థలు, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మేకర్స్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్, ఇతరులకు తెలియని నెంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు, మీరు మంచి పనులు చేయలేదు’’ అని అఘాంతకుడు బెదిరించాడు. ఈ బెదిరింపులపై సుదీప్తో సేన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం ఇది..
కేరళ స్టోరీ సినిమా మతమార్పిడులు, లవ్ జిహాద్, ఉగ్రవాదం ఇతివృత్తంగా రూపొందించబడింది. కేరళలో 32,000 హిందూ, క్రిస్టియన్ యువతులు మతమార్పిడికి గురయ్యారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని సినిమాలో చూపించారు. ఐసిస్ లో పనిచేసేందుకు సిరియాకు వెళ్లారని సినిమా ట్రైలర్ లో చూపించడం వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి