Delhi Car Blast: 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
- తీగ లాగితే డొంకంతా కదులుతోంది
- 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13
- ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ప్రధానంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఉమర్కు 4వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచి కూడా మూడు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో పలువురి పేర్లు ఉన్నాయి. అలాగే దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి దాడులు జరిపేందుకు మూడు కార్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక కారు ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఇంకో కారు ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
మొత్తం 8 మందితో దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు డైరీల నుంచి సేకరించిన సమాచారంతో అధికారులు కనిపెట్టారు. ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాడుల బాధ్యతలను పూర్తిగా ఉమర్కు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలు కోసం మొత్తం రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బుతోనే అన్ని పరికరాలు సేకరించి.. పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!