Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
- రేపే బీహార్ ఫలితాలు
- ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
Also Read
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. దీంతో అధికార కూటమిలో ఫుల్ జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలియడంతో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
ఇదిలా ఉండగా తాజాగా నితీష్ కుమార్కు సంబంధించిన పోస్టర్లు పాట్నాలో వెలిశాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా కూడా పోస్టర్లు వెలుగుచూశాయి. ‘టైగర్ జిందా హై’తో నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. తిరిగి అధికారంలోకి రాబోతున్నామంటూ సూచిస్తూ కార్యకర్తలు పోస్టర్లు వేశారు.
బీహార్ ప్రజలు నితీష్-మోడీ అభివృద్ధి కోసం ఓటు వేశారని కేంద్రమత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన దానికంటే కూడా ఎన్డీఏ 206 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతిపరుడని, అందువల్ల వారికి ఓటు వేయడానికి ఎవరూ ఇష్టపడరన్నారు.
ఇక సర్వేలను మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తిరస్కరించారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు జరుగుతుందని తెలిపారు. శుక్రవారం సర్వేల అంచనాలు తారుమారు అవుతాయని చెప్పారు. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | Poster featuring CM Nitish Kumar that reads "Tiger abhi zinda hain" put up outside JDU office in Patna, Bihar #BiharElection2025 pic.twitter.com/zZIggXeyJ5
— ANI (@ANI) November 13, 2025
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!