Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- పెళ్లిలో షాకింగ్ ఘటన
- వరుడిపై కత్తి దాడి
- నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వివాహ రిసెప్షన్లో దుండగుడు రెచ్చిపోయాడు. వేదికపై వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుండగా హఠాత్తుగా ఒక యువకుడు కత్తితో ఎటాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
మంగళవారం మహారాష్ట్రలోని అమరావతిలో రిసెప్షన్ వేడుక జరుగుతోంది. వధూవరులు ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి స్టేజ్పైకి ఎక్కి అమాంతంగా వరుడిని కత్తితో పొడవడం ప్రారంభించాడు. తొడపై పొడవడంతో అప్రమత్తమైన వరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో బంధువులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో నిందితుడు పరారయ్యాడు. బయట రెడీగా ఉన్న బైక్పై జితేంద్ర పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కూడా బెదిరించి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు పారిపోతుండగా 2 కిలోమీటర్ల మేర డ్రోన్ వెంటాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల సుజల్ రామ్ సముద్ర వివాహ వేడుక సందర్భంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. నిందితుడు రాఘో జితేంద్ర బక్షి.. సుజల్ రామ్ స్నేహితుడిగా గుర్తించారు. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుజల్ తొడ, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, అతిథులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాధారణ చికిత్స తర్వాత యథావిధిగా వేదికపైకి వచ్చేశాడు. వ్యక్తిగత వైరం కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీసీపీ గణేష్ షిండే తెలిపారు.

ఇక దాడి తర్వాత నిందితుడి కుటుంబంపై బాధిత కుటుంబం దాడి చేసింది. ఇల్లును ధ్వంసం చేశారు. బైక్కు నిప్పంటించారు. దీంతో నిందితుడి కుటుంబం కూడా వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని సుజాల్ పేర్కొన్నాడు. ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదన్నాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
-
Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
-
Kanchana 4: కాంచన – 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్కు రిక్త హస్తమే..
-
Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!