Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- పెళ్లిలో షాకింగ్ ఘటన
- వరుడిపై కత్తి దాడి
- నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వివాహ రిసెప్షన్లో దుండగుడు రెచ్చిపోయాడు. వేదికపై వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుండగా హఠాత్తుగా ఒక యువకుడు కత్తితో ఎటాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
మంగళవారం మహారాష్ట్రలోని అమరావతిలో రిసెప్షన్ వేడుక జరుగుతోంది. వధూవరులు ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి స్టేజ్పైకి ఎక్కి అమాంతంగా వరుడిని కత్తితో పొడవడం ప్రారంభించాడు. తొడపై పొడవడంతో అప్రమత్తమైన వరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో బంధువులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో నిందితుడు పరారయ్యాడు. బయట రెడీగా ఉన్న బైక్పై జితేంద్ర పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కూడా బెదిరించి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు పారిపోతుండగా 2 కిలోమీటర్ల మేర డ్రోన్ వెంటాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల సుజల్ రామ్ సముద్ర వివాహ వేడుక సందర్భంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. నిందితుడు రాఘో జితేంద్ర బక్షి.. సుజల్ రామ్ స్నేహితుడిగా గుర్తించారు. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుజల్ తొడ, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, అతిథులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాధారణ చికిత్స తర్వాత యథావిధిగా వేదికపైకి వచ్చేశాడు. వ్యక్తిగత వైరం కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీసీపీ గణేష్ షిండే తెలిపారు.

ఇక దాడి తర్వాత నిందితుడి కుటుంబంపై బాధిత కుటుంబం దాడి చేసింది. ఇల్లును ధ్వంసం చేశారు. బైక్కు నిప్పంటించారు. దీంతో నిందితుడి కుటుంబం కూడా వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని సుజాల్ పేర్కొన్నాడు. ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదన్నాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!