Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- పెళ్లిలో షాకింగ్ ఘటన
- వరుడిపై కత్తి దాడి
- నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వివాహ రిసెప్షన్లో దుండగుడు రెచ్చిపోయాడు. వేదికపై వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుండగా హఠాత్తుగా ఒక యువకుడు కత్తితో ఎటాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
మంగళవారం మహారాష్ట్రలోని అమరావతిలో రిసెప్షన్ వేడుక జరుగుతోంది. వధూవరులు ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి స్టేజ్పైకి ఎక్కి అమాంతంగా వరుడిని కత్తితో పొడవడం ప్రారంభించాడు. తొడపై పొడవడంతో అప్రమత్తమైన వరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో బంధువులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో నిందితుడు పరారయ్యాడు. బయట రెడీగా ఉన్న బైక్పై జితేంద్ర పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కూడా బెదిరించి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు పారిపోతుండగా 2 కిలోమీటర్ల మేర డ్రోన్ వెంటాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల సుజల్ రామ్ సముద్ర వివాహ వేడుక సందర్భంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. నిందితుడు రాఘో జితేంద్ర బక్షి.. సుజల్ రామ్ స్నేహితుడిగా గుర్తించారు. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుజల్ తొడ, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, అతిథులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాధారణ చికిత్స తర్వాత యథావిధిగా వేదికపైకి వచ్చేశాడు. వ్యక్తిగత వైరం కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీసీపీ గణేష్ షిండే తెలిపారు.

ఇక దాడి తర్వాత నిందితుడి కుటుంబంపై బాధిత కుటుంబం దాడి చేసింది. ఇల్లును ధ్వంసం చేశారు. బైక్కు నిప్పంటించారు. దీంతో నిందితుడి కుటుంబం కూడా వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని సుజాల్ పేర్కొన్నాడు. ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదన్నాడు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!