Ayodhya Terror Attack: అయోధ్యపై దాడికి ప్లాన్.. ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
- అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్
- ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది రెహ్మాన్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో రెహ్మాన్కు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెహ్మాన్.. మాంసం దుకాణంతో పాటు ఆటో నడిపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: VenkyAnil 3 : 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎన్ని సెంటర్స్ అంటే.?
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. రెహ్మాన్ను 10 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కొంతకాలంగా అయోధ్యపై దాడికి కుట్ర పన్నినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్.. ఇస్లామిక్ సమావేశాల్లో కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. 2024, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. ఆ సమయంలో రెహ్మాన్ అనేక రౌండ్లు వేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నిఘా కూడా ఉంచినట్లు కనిపెట్టారు. ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: AP Legislative Council: ఆ పాపం జగన్ రెడ్డిదే.. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదు: మంత్రి గొట్టిపాటి
రెండు హ్యాండ్ గ్రెనేడ్లను రైల్లో అయోధ్యకు తీసుకెళ్లాలని రెహ్మాన్ ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హర్యానా ఎస్టీఎఫ్, గుజరాత్లోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న పాలి గ్రామం సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో రెహ్మాన్ దాచిపెట్టాడు. రెండింటినీ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. నిందితుడిని ఏటీఎస్ బృందం గుజరాత్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే ఈ కుట్రలో మరింత మంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: SLBC: రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!