Telangana Debts Row: శ్రీలంక సంక్షోభం ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ అప్పులపై రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Discusses on Telangana Debts in All Party Meeting: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాల అప్పులు ప్రస్తావన వచ్చింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల అప్పులపై చర్చించారు. అయితే శ్రీలంక సంక్షోభంపై నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్ లో వివిధ రాష్ట్రాల అప్పుల గుర్తించి ప్రస్తావించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రస్తుతం ఈ విషయం కొత్త వివాదానికి దాారి తీసింది. మంగళవారం విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వివిధ రాష్ట్రాల అప్పుల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ముఖ్యంగా కేంద్ర వైఖరిపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణ అప్పులపై మాట్లాడింది. శ్రీలంక పరిస్థితికి రాజకీయాలు, అప్పులే కారణం అని కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ లో వెల్లడించింది. దీంతో పాటు శ్రీలంకలో చైనా పెట్టుబడులు, పోర్టుల్లో పెట్టుబడుల కారణంగా రుణ ఊబిలో చిక్కకుపోయిందని కేంద్రం విశ్లేషించింది.
Read Also: Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ సమావేశంలోొ శ్రీలంక సంక్షోభం అప్పులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని పార్టీలకు వివరించింది. అయితే శ్రీలంక ప్రస్తుత సంక్షోభానికి అపరిమిత అప్పులే కారణం అని విశ్లేషణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా ఇండియాలో కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పుల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల అప్పుల గురించి చర్చించడాన్ని టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్ర చేస్తున్న అప్పుల గురించి కూడా వివరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడటంలో రాజకీయ దురుద్దేశం ఉందని నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని.. గత ఎనిమిదేళ్లలో కేంద్ర లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిందని.. నామా నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో కేవలం 23 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని ఆయన కేంద్రానికి వివరించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!