Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎప్పుడూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. కేసీఆర్ సంగతి ఎత్తితే ఆయన విమర్శలు మరింత పదునెక్కుతుంటాయి. కానీ ఆయన చాలా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన చేసిన వీడియో, ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది. ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుందని ట్వీట్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
ప్రముఖ క్రీడాకారులు-ఆటో బయోగ్రఫీలు
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. ఇది తేటతెల్లం అయింది. పిల్లలందరినీ రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు ఫ్రెషర్ పెరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతోంది. ఆ వివరాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదు. నేనేం వెటకారంగా అలా అనడం లేదు. ఆయనపై పరుష పదజాలం వుపయోగించను. సాంకేతికంగా మాత్రమే నేను మాట్లాడతాను. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుంది. నేనేం వెటకారంగా అనడంలేదు. ఆయన పెద్ద మనిషి, ఆయన్ని బాధించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
ఇటీవల ఎంపీ అరవింద్ వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం కోసం ఎంపీ తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో అర్వింద్ ట్వీట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!