Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎప్పుడూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. కేసీఆర్ సంగతి ఎత్తితే ఆయన విమర్శలు మరింత పదునెక్కుతుంటాయి. కానీ ఆయన చాలా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన చేసిన వీడియో, ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది. ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుందని ట్వీట్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
ప్రముఖ క్రీడాకారులు-ఆటో బయోగ్రఫీలు
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. ఇది తేటతెల్లం అయింది. పిల్లలందరినీ రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు ఫ్రెషర్ పెరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతోంది. ఆ వివరాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదు. నేనేం వెటకారంగా అలా అనడం లేదు. ఆయనపై పరుష పదజాలం వుపయోగించను. సాంకేతికంగా మాత్రమే నేను మాట్లాడతాను. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుంది. నేనేం వెటకారంగా అనడంలేదు. ఆయన పెద్ద మనిషి, ఆయన్ని బాధించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
ఇటీవల ఎంపీ అరవింద్ వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం కోసం ఎంపీ తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో అర్వింద్ ట్వీట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!