Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎప్పుడూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. కేసీఆర్ సంగతి ఎత్తితే ఆయన విమర్శలు మరింత పదునెక్కుతుంటాయి. కానీ ఆయన చాలా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన చేసిన వీడియో, ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది. ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుందని ట్వీట్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
ప్రముఖ క్రీడాకారులు-ఆటో బయోగ్రఫీలు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. ఇది తేటతెల్లం అయింది. పిల్లలందరినీ రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు ఫ్రెషర్ పెరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతోంది. ఆ వివరాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదు. నేనేం వెటకారంగా అలా అనడం లేదు. ఆయనపై పరుష పదజాలం వుపయోగించను. సాంకేతికంగా మాత్రమే నేను మాట్లాడతాను. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుంది. నేనేం వెటకారంగా అనడంలేదు. ఆయన పెద్ద మనిషి, ఆయన్ని బాధించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
ఇటీవల ఎంపీ అరవింద్ వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం కోసం ఎంపీ తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో అర్వింద్ ట్వీట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!