Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఎప్పుడూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. కేసీఆర్ సంగతి ఎత్తితే ఆయన విమర్శలు మరింత పదునెక్కుతుంటాయి. కానీ ఆయన చాలా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన చేసిన వీడియో, ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు చాలా బాధనిపించింది, జాలి కూడా కలిగింది. ఆయన మమ్మల్ని ఏ విధంగా బాధించినా, ఇకనుండి వారిపై పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుందని ట్వీట్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.
ప్రముఖ క్రీడాకారులు-ఆటో బయోగ్రఫీలు
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. ఇది తేటతెల్లం అయింది. పిల్లలందరినీ రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు ఫ్రెషర్ పెరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతోంది. ఆ వివరాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదు. నేనేం వెటకారంగా అలా అనడం లేదు. ఆయనపై పరుష పదజాలం వుపయోగించను. సాంకేతికంగా మాత్రమే నేను మాట్లాడతాను. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆయన బాధలో వున్నారు. ఆయన మానసిక ఆరోగ్యంపై దిగులుగా వుంది. నేనేం వెటకారంగా అనడంలేదు. ఆయన పెద్ద మనిషి, ఆయన్ని బాధించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
ఇటీవల ఎంపీ అరవింద్ వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం కోసం ఎంపీ తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో అర్వింద్ ట్వీట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!