CM K.Chandrashekar Rao: అఖిలేష్ యాదవ్తో సీఎం కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM K.Chandrashekar Rao: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిరువురిని శాలువా కప్పి ఆహ్వానం పలికారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటివరకు పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై మాట్లాడారు. కాంగ్రెస తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు సాగించడం వంటి పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ప్రారంభంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, శరద్ పవార్లతో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల గురించి ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అనేక సార్లు ఈ నాయకులను కలుసుకున్నారు.
Also Read
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
Komatireddy Rajagopal Reddy: ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.. కోమటి రాజగోపాల్రెడ్డి.. ఇటా? అటా..?
ఇటీవల బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తన మాటల తూటాలతో దాడిని మరింత పెంచారు. ఇటీవల ఆయన ప్రధాని మోదీని “దేశం ఎన్నడూ చూడని బలహీనమైన ప్రధాని” అని అన్నారు. దేశంలో “ప్రకటించని ఎమర్జెన్సీ” ఉందని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గత మూడు రోజులుగా దేశ రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలతో పలు సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రైతు సంఘాల ప్రతినిధులతోనూ ఆయన సమావేశం కానున్నారు.
Telangana Chief Minister K Chandrasekhar Rao met Samajwadi Party (SP) chief Akhilesh Yadav and party leader Ram Gopal Yadav at his residence in Delhi today. They discussed the ongoing national politics and other national issues. pic.twitter.com/k5hIngONQQ
— ANI (@ANI) July 29, 2022
తాజావార్తలు
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..