Hijab Row: హిజాబ్ వివాదంలో ప్రిన్సిపాల్.. అవార్డుపై కర్ణాటక సర్కార్ నిషేధం..!
- హిజాబ్ వివాదంలో చిక్కుకున్న కర్ణాటక ప్రిన్సిపాల్కు బెస్ట్ టీచర్స్ అవార్డు..
- వివాదంలో ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమేయం ఉందని ఆరోపణలు..
- ఈ అంశాన్ని క్షుణ్ణంగా విచారించిన తర్వాతే అవార్డుపై నిర్ణయం తీసుకుంటాం: కర్ణాటక మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Row: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్లోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. గత బీజీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిన హిజాబ్ వివాదానికి కారణమైన వారిలో రామకృష్ణ బీజీ కూడా ఉన్నారని ఆరోపిస్తూ సెలెక్టర్లు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
కాగా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉడిపి కళాశాల ప్రిన్సిపాల్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో తలెత్తిన హిజాబ్ వివాదంతో ప్రిన్సిపాల్ రామకృష్ణకు సంబంధం ఉందని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి విద్వేషపూరిత సందేశాలు పంపి వివాదానికి కారణమయ్యారని ఆరోపించారు. అలాగే, SDPI దక్షిణ కన్నడ అధ్యక్షుడు అన్వర్ సాదత్ బజ్తూర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కళాశాలకు రాకుండా నిషేధించిన ప్రిన్సిపాల్ కు.. నెలల తరబడి వీధుల్లో నిరసన తెలపాల్సి వచ్చింది.. అలాంటి వ్యక్తికి ప్రిన్సిపాల్గా ఉండే హక్కులేదని చెప్పిన.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అవార్డుకు ఎందుకు నామినేట్ చేసింది? అని ప్రశ్నించారు.
Read Also: Simi Singh: ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్రౌండర్.. దాతల కోసం ఎదురుచూపు! కోమాలోకి వెళ్లే ప్రమాదం
అయితే, 2022 సంవత్సరంలో కుందాపూర్ పీయూ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చినందుకు 28 మంది విద్యార్థినులను క్లాస్లోకి అనుమతించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. దేశవ్యాప్తంగా ముస్లిం కళాశాల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి.. ఆందోళన బాట పట్టారు. ఈ హిజాబ్ ధరించడంపై వివాదం ముస్లిం విద్యార్థులు, సామాజిక వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో విద్యావ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైంది.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!