TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
- సుప్రీంకోర్టుకు చేరిన టీసీఎస్ నాసిక్ కేసు
- బలవంతపు మతమార్పిడులపై కఠిన చర్యల కోసం పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు ముస్లిం ఉద్యోగులు ఒక కుట్ర ప్రకారం హిందూ మహిళల్ని, ఇతర ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతమార్పిడులు, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఆరోపణల్ని నిందితులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇలాంటి చర్యలు ఉగ్రవాద చర్యల పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధమైన మతమార్పిడులు అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. టీసీఎస్ నాసిక్ కేసు కేవలం ఒక్కటే కాదని, ఇది పెద్ద వ్యవస్థీకృత, బలవంతపు ప్రచారంలో భాగమని పిటిషనర్ వాదించారు.
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
Read Also: Ashok Leyland: అశోక్ లేలాండ్ కొత్త వాణిజ్య వాహనం దోస్త్ విడుదల.. స్పెసిఫికేషన్స్, ధర పూర్తి వివరాలు
మోసపూరిత మరియు బలవంతపు మత మార్పిడులు దేశ ఐక్యతకు, భద్రతకు తీవ్రమైన ముప్పు అని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. భారతదేశ జనాభా సమతుల్యతను మార్చడానికి విదేశీ సంస్థల నిధులతో నడిచే ఒక వ్యవస్థీకృత కుట్ర కిందకు వస్తాయని పిటిషనర్ వాదించారు. ఇలాంటి కార్యకలాపాలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని, దీని వల్ల ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాల కింద పరిగణించాలని కోరారు. మత స్వేచ్ఛ హక్కు సంపూర్ణమైంది కాదని, అది ప్రజాభద్రత, నైతికతకు లోబడి ఉంటుందని పిటిషన్ నొక్కి చెప్పారు.
ఈ కేసులో 9 మంది బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. వీరిలో చాలా మంది మహిళలే. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు నిందితులు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఒక గ్రూప్గా పనిచేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ చెప్పారు. ఈ కేసులో ఏడుగురు పురషులు, ఒక మహిళ సహా 8 మందిని అరెస్ట్ చేయగా, వీరికి సహకరించిన హెచ్ ఆర్ మేనేజన్ నిదా ఖాన్ పరీరాలో ఉంది. వివాదాల నేపథ్యంలో టీసీఎస్ నాసిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!