TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
- సుప్రీంకోర్టుకు చేరిన టీసీఎస్ నాసిక్ కేసు
- బలవంతపు మతమార్పిడులపై కఠిన చర్యల కోసం పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు ముస్లిం ఉద్యోగులు ఒక కుట్ర ప్రకారం హిందూ మహిళల్ని, ఇతర ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతమార్పిడులు, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఆరోపణల్ని నిందితులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇలాంటి చర్యలు ఉగ్రవాద చర్యల పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధమైన మతమార్పిడులు అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. టీసీఎస్ నాసిక్ కేసు కేవలం ఒక్కటే కాదని, ఇది పెద్ద వ్యవస్థీకృత, బలవంతపు ప్రచారంలో భాగమని పిటిషనర్ వాదించారు.
Also Read
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
Read Also: Ashok Leyland: అశోక్ లేలాండ్ కొత్త వాణిజ్య వాహనం దోస్త్ విడుదల.. స్పెసిఫికేషన్స్, ధర పూర్తి వివరాలు
మోసపూరిత మరియు బలవంతపు మత మార్పిడులు దేశ ఐక్యతకు, భద్రతకు తీవ్రమైన ముప్పు అని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. భారతదేశ జనాభా సమతుల్యతను మార్చడానికి విదేశీ సంస్థల నిధులతో నడిచే ఒక వ్యవస్థీకృత కుట్ర కిందకు వస్తాయని పిటిషనర్ వాదించారు. ఇలాంటి కార్యకలాపాలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని, దీని వల్ల ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాల కింద పరిగణించాలని కోరారు. మత స్వేచ్ఛ హక్కు సంపూర్ణమైంది కాదని, అది ప్రజాభద్రత, నైతికతకు లోబడి ఉంటుందని పిటిషన్ నొక్కి చెప్పారు.
ఈ కేసులో 9 మంది బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. వీరిలో చాలా మంది మహిళలే. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు నిందితులు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఒక గ్రూప్గా పనిచేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ చెప్పారు. ఈ కేసులో ఏడుగురు పురషులు, ఒక మహిళ సహా 8 మందిని అరెస్ట్ చేయగా, వీరికి సహకరించిన హెచ్ ఆర్ మేనేజన్ నిదా ఖాన్ పరీరాలో ఉంది. వివాదాల నేపథ్యంలో టీసీఎస్ నాసిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!