Chess Olympiad: ఆకట్టుకుంటోన్న చెస్ బోర్డు లాంటి బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా?
Chess Olympiad: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. చెస్ బోర్డులా పెయింట్ వేయబడిన ఈ వంతెన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ వంతెనకు సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కారులో వెళ్తూ రికార్డు చేసిన వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ…భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. “యానిమేటెడ్ ప్రపంచంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది,” అని మరొకరు కామెంట్ చేశారు. చెస్ ఒలింపియాడ్-2022 టీజర్ను రజనీకాంత్ విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ వీడియో వచ్చింది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఆగస్టు 10న ముగుస్తుంది. దాదాపు 100 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. రాబోయే ఈవెంట్ కోసం మొత్తం 188 దేశాలు నమోదు చేసుకున్నాయి.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
గత నెలలో 44వ చెస్ ఒలింపియాడ్ కోసం తొలిసారిగా టార్చ్ రిలేను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. “చెస్ ఒలింపియాడ్ మొట్టమొదటి టార్చ్ రిలే భారతదేశం నుండి ప్రారంభమవుతుందని, భారతదేశం పెద్ద ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.” అని ప్రధాని తెలిపారు. ఈ క్రీడ తన జన్మస్థలం నుండి పురోగమించి ప్రపంచమంతటా తన ఉనికిని చాటుకున్నందుకు గర్విస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. చెస్ దాని జన్మస్థలానికి తిరిగి రావడం, చెస్ ఒలింపియాడ్ రూపంలో దాని విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU
— Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ 44వ చెస్ ఒలింపియాడ్ టీజర్ను శుక్రవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పోటీలు రాష్ట్రంలో నిర్వహించడం తమిళులందరికీ గర్వకారణమని అన్నారు. సుమారు 30 సెకన్ల నిడివిగల ఆ టీజర్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తెల్లటి ప్యాంటు చొక్కా ధరించి గంభీరంగా నడిచి వచ్చే దృశ్యాలు ఉన్నాయి. మహాబలిపురం సముద్రతీర ఆలయం వద్ద భరత నాట్య కళాకారిణులు నృత్యం చేస్తున్న దృశ్యాలు, నేపియర్ వంతెన చెస్ బోర్డు రంగులను పులుముకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వీడియో చివరలో స్టాలిన్ నమస్కరిస్తుండగా.. తమిళనాడుకు రండి రండి అంటూ పాట ముగుస్తుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో ఈ టీజర్ రూపొందింది.
Welcome To Namma Ooru Chennai!
வருக… வருக… தமிழ்நாட்டுக்கு வருக!
Superstar @rajinikanth🙏#ChessChennai2022 https://t.co/L2hvMm8XT4
— M.K.Stalin (@mkstalin) July 15, 2022
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?