Tamil Nadu Governor: ‘‘జై శ్రీరాం’’ నినాదం వివాదంలో గవర్నర్ ఆర్ఎన్ రవి..
- మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి..
- విద్యార్థుల్ని ‘‘జై శ్రీరాం’’ నినాదం చెప్పాలని కోరడంపై వివాదం..
- గవర్నర్ని విమర్శిస్తున్న ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు..
- బిల్లుల విషయంలో ఇటీవల గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
ఒక కార్యక్రమానికి హాజరైన ఆర్ఎన్ రవి విద్యార్థుల్ని ‘‘జైశ్రీరాం’’ అని నినాదం చేయాలని కోరారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఆయన చర్యని ప్రభుత్వంతో పాటు విద్యా సంస్థల నాయకులు ఖండిస్తున్నారు. ఒక విద్యాసంస్థ కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరింది.
Also Read
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
Read Also: Bengal Waqf Clashes: బెంగాల్లో బలపడుతున్న బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ.. ఇంటెల్ హెచ్చరిక..
SPCSS-TN (స్టేట్ ప్లాట్ఫామ్ ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ – తమిళనాడు) ఒక ప్రకటనలో.. ‘‘మిస్టర్ ఆర్ఎన్ రవి తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని పాటించడంలో ఆయన దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడంలో విఫలమయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందుకు తమిళనాడు గవర్నర్ని వెంటనే తొలగించాలి’’ అని డిమాండ్ చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత శశికాంత్ సెంథిల్ కూడా రవిపై ఎక్స్లో విమర్శలు గుప్పించారు. ‘‘సుప్రీంకోర్టు విమర్శల తర్వాత అతను ఇప్పుడు వ్యవస్థల్ని చికాకు పెట్టడానికి విద్యార్థుల్ని జై శ్రీరాం నినదించేలా చేయడం వంటి విన్యాసాలు చేస్తున్నారు, ఆయన నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మార్గాలు కనుగొంటారు.’’ అని సెటైర్లు వేశారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగ సూత్రాలను బలహీనపరిచే అహంకారం, ధిక్కరణల ప్రమాదకరమైన మిశ్రమమని అన్నారు.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?