Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం.. జయలలిత మృతిపై మరికొందరిని విచారించేందుకు ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది. శశికళ, శివకుమార్లతో పాటు నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావుపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలనే సిఫారసులపై న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది తమిళనాడు మంత్రివర్గం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి, తూత్తుకుడి హింస, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ తదితర అంశాలకు సంబంధించిన దర్యాప్తు నివేదికపై చర్చించడం ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చకు వచ్చింది. జయలలిత మృతిపై విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆరుముగసామి ఆగస్టు 27న తన నివేదికను సమర్పించగా.. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీషన్ 2018లో స్టెరిలైట్ వ్యతిరేక నిరసన సందర్భంగా జరిగిన తూత్తుకుడి కాల్పులపై నివేదికను సమర్పించారు. కలెక్టర్తో సహా 17 మంది పోలీసు సిబ్బంది, నలుగురు జిల్లా అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన అరుణ జగదీశన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అంగీకరించింది.
Also Read
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో శశిథరూర్!
కాగా, జయలలిత మృతిపై విచారణ చేపట్టిన ఆరుముగసామి.. వీకే శశికళ, శివకుమార్, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావులపై ప్రభుత్వ విచారణకు సిఫారసు చేసినట్లు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. న్యాయసలహా పొంది చర్యలు తీసుకోవాలని, నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరుముగసామి కమిషన్ నవంబర్ 2017లో ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. మరో ముఖ్యమైన సమస్య ఆన్లైన్ జూదం, ఆన్లైన్ జూదానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
ట్రెండింగ్
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!