Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం.. జయలలిత మృతిపై మరికొందరిని విచారించేందుకు ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది. శశికళ, శివకుమార్లతో పాటు నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావుపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలనే సిఫారసులపై న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది తమిళనాడు మంత్రివర్గం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి, తూత్తుకుడి హింస, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ తదితర అంశాలకు సంబంధించిన దర్యాప్తు నివేదికపై చర్చించడం ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చకు వచ్చింది. జయలలిత మృతిపై విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆరుముగసామి ఆగస్టు 27న తన నివేదికను సమర్పించగా.. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీషన్ 2018లో స్టెరిలైట్ వ్యతిరేక నిరసన సందర్భంగా జరిగిన తూత్తుకుడి కాల్పులపై నివేదికను సమర్పించారు. కలెక్టర్తో సహా 17 మంది పోలీసు సిబ్బంది, నలుగురు జిల్లా అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన అరుణ జగదీశన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అంగీకరించింది.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్లోకి గ్యాంగ్స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో శశిథరూర్!
కాగా, జయలలిత మృతిపై విచారణ చేపట్టిన ఆరుముగసామి.. వీకే శశికళ, శివకుమార్, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావులపై ప్రభుత్వ విచారణకు సిఫారసు చేసినట్లు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. న్యాయసలహా పొంది చర్యలు తీసుకోవాలని, నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరుముగసామి కమిషన్ నవంబర్ 2017లో ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. మరో ముఖ్యమైన సమస్య ఆన్లైన్ జూదం, ఆన్లైన్ జూదానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!