MK Stalin: దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ అణిచివేస్తోంది
- డీలిమిటేషన్పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
- దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ అణిచివేస్తోందని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Also Read
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా దేశం ఏర్పడిందని తెలిపారు. భారత సమాఖ్యను కాపాడటానికి ఇది ముఖ్యమైన రోజు అని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీలిమిటేషన్ సొంత దేశంలో వారిని శక్తిహీనులుగా చేస్తుందన్నారు. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇది సంఖ్యల గురించి కాదు.. ఇది అధికారం గురించి అని పేర్కొన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని.. అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం ఐక్యంగా ఉన్నామని.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్నిర్మాణం ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా స్టాలిన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఇది కూడా చదవండి: Aaron Finch: విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు..
ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, టీఆర్ఎస్ తరపున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. ఇక కేరళ నుంచి ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హాజరయ్యారు. ఏపీ నుంచి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గైర్హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Drugs: ఏపీలో ఉగ్రవాదులు ఉపయోగించే డ్రగ్స్.. అధికారులు షాక్
తాజావార్తలు
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!